Political News

బీఆర్ఎస్ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ ?

రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు.

ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించటమే బ్యాలెన్సుంది అనుకుంటున్న సమయంలో కోర్టు స్టే ఇచ్చింది. కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటుచేయటాన్ని అఖిలభారత యాదవ సంఘంతో పాటు మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరం చెప్పటమే కాకుండా కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఆ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలపై స్టే విధించింది. కోర్టు ఆదేశాలు అయ్యేంతవరకు విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని ఆదేశించింది.

ఇక్కడ విషయం ఏమింటే విగ్రహాన్ని ఏర్పాటుచేసేంత ఎన్టీయార్ పై అభిమానం మంత్రి పువ్వాడ అజయ్ లో లేదు. అయితే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుచేశారనే పేరుతో కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎన్టీయార్ అభిమానుల ఓట్లను వేయించుకోవటమే పువ్వాడ ప్లాన్. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలుపు అనుమానం. కమ్మ సామాజికవర్గంలోనే పువ్వాడంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కమ్మ సంఘం ఎన్నికల్లో స్వయంగా పువ్వాడ మద్దతిచ్చి, ప్రచారం చేసిన వ్యక్తి ఓడిపోయారు.

ఆ ఎన్నికల్లోనే మంత్రికి సామాజికవర్గంలో కూడా పట్టులేదన్న విషయం బయటపడింది. అప్పటినుండి వచ్చేఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలన్నదే పువ్వాడను పట్టి పీడిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు, జూనియర్ ఎన్టీయార్ ను పిలవటం అనేది ఒక ఆప్షన్ గా చేసుకున్నారు. ఎన్టీయార్ జపంచేయటం ద్వారా అయినా సామాజికవర్గం ఓట్లు వేయించుకోవాలన్నది పువ్వాడ వ్యూహంగా కనబడుతోంది. అయితే దానికి కోర్టు అడ్డుపుల్ల వేసింది. 25వ తేదీన ఇదే విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మాత్రమే తాము వ్యతిరేకమని పిటీషనర్లు స్పష్టంచేస్తున్నారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి. 

This post was last modified on May 19, 2023 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

21 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago