రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు.
ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించటమే బ్యాలెన్సుంది అనుకుంటున్న సమయంలో కోర్టు స్టే ఇచ్చింది. కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటుచేయటాన్ని అఖిలభారత యాదవ సంఘంతో పాటు మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరం చెప్పటమే కాకుండా కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఆ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలపై స్టే విధించింది. కోర్టు ఆదేశాలు అయ్యేంతవరకు విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని ఆదేశించింది.
ఇక్కడ విషయం ఏమింటే విగ్రహాన్ని ఏర్పాటుచేసేంత ఎన్టీయార్ పై అభిమానం మంత్రి పువ్వాడ అజయ్ లో లేదు. అయితే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుచేశారనే పేరుతో కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎన్టీయార్ అభిమానుల ఓట్లను వేయించుకోవటమే పువ్వాడ ప్లాన్. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలుపు అనుమానం. కమ్మ సామాజికవర్గంలోనే పువ్వాడంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కమ్మ సంఘం ఎన్నికల్లో స్వయంగా పువ్వాడ మద్దతిచ్చి, ప్రచారం చేసిన వ్యక్తి ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లోనే మంత్రికి సామాజికవర్గంలో కూడా పట్టులేదన్న విషయం బయటపడింది. అప్పటినుండి వచ్చేఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలన్నదే పువ్వాడను పట్టి పీడిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు, జూనియర్ ఎన్టీయార్ ను పిలవటం అనేది ఒక ఆప్షన్ గా చేసుకున్నారు. ఎన్టీయార్ జపంచేయటం ద్వారా అయినా సామాజికవర్గం ఓట్లు వేయించుకోవాలన్నది పువ్వాడ వ్యూహంగా కనబడుతోంది. అయితే దానికి కోర్టు అడ్డుపుల్ల వేసింది. 25వ తేదీన ఇదే విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మాత్రమే తాము వ్యతిరేకమని పిటీషనర్లు స్పష్టంచేస్తున్నారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.
This post was last modified on May 19, 2023 5:09 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…