రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు.
ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరించటమే బ్యాలెన్సుంది అనుకుంటున్న సమయంలో కోర్టు స్టే ఇచ్చింది. కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటుచేయటాన్ని అఖిలభారత యాదవ సంఘంతో పాటు మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరం చెప్పటమే కాకుండా కోర్టులో పిటీషన్ కూడా వేశారు. ఆ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలపై స్టే విధించింది. కోర్టు ఆదేశాలు అయ్యేంతవరకు విగ్రహాన్ని ఆవిష్కరించవద్దని ఆదేశించింది.
ఇక్కడ విషయం ఏమింటే విగ్రహాన్ని ఏర్పాటుచేసేంత ఎన్టీయార్ పై అభిమానం మంత్రి పువ్వాడ అజయ్ లో లేదు. అయితే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుచేశారనే పేరుతో కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎన్టీయార్ అభిమానుల ఓట్లను వేయించుకోవటమే పువ్వాడ ప్లాన్. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలుపు అనుమానం. కమ్మ సామాజికవర్గంలోనే పువ్వాడంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కమ్మ సంఘం ఎన్నికల్లో స్వయంగా పువ్వాడ మద్దతిచ్చి, ప్రచారం చేసిన వ్యక్తి ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లోనే మంత్రికి సామాజికవర్గంలో కూడా పట్టులేదన్న విషయం బయటపడింది. అప్పటినుండి వచ్చేఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలన్నదే పువ్వాడను పట్టి పీడిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు, జూనియర్ ఎన్టీయార్ ను పిలవటం అనేది ఒక ఆప్షన్ గా చేసుకున్నారు. ఎన్టీయార్ జపంచేయటం ద్వారా అయినా సామాజికవర్గం ఓట్లు వేయించుకోవాలన్నది పువ్వాడ వ్యూహంగా కనబడుతోంది. అయితే దానికి కోర్టు అడ్డుపుల్ల వేసింది. 25వ తేదీన ఇదే విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటుచేయటానికి మాత్రమే తాము వ్యతిరేకమని పిటీషనర్లు స్పష్టంచేస్తున్నారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.
This post was last modified on May 19, 2023 5:09 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…
త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…
వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…