థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీయార్ ఆశలు నీరుగారిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కేసీయార్ కలలు కలలుగానే మిగిలిపోతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే మొన్నటివరకు కేసీయార్ కు మద్దతిచ్చిన మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ తాజాగా కాంగ్రెస్ కు జై కొట్టడమే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో జాతీయ రాజకీయాల ముఖచిత్రం మారిపోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీయార్ నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలతో కలిసి జట్టుకట్టాలని చాలా ప్రయత్నించారు. బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జాతయస్ధాయిలో చాలా ప్రయత్నాలు చేశారు. తటస్తంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీజేడీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళను పదేపదే కలిశారు. బీజేపీ అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీయార్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొందరు మద్దతు పలికారు.
అయితే కేసీయార్ మరచిపోయిందేమిటంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీ కొనటం సాధ్యంకాదని. బలమైన బీజేపీని ఢీ కొట్టాలంటే జాతీయస్ధాయిలో యంత్రాంగం ఉన్న కాంగ్రెస్ అండలేకుండా సాధ్యంకాదు. మొదట్లో మమత కూడా కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని చూపించారు. అయితే తొందరగానే ఆమె వాస్తవాన్ని గ్రహించారు. కేసీయార్ మాత్రం తన వైఖరిలోనే తానున్నారు. ఈ నేపధ్యంలోనే కర్నాటక ఫలితాలు వచ్చాయి. వెంటనే మమత, అఖిలేష్ కాంగ్రెస్ తో చేతులు కలపటానికి అభ్యంతరం లేదని ప్రకటించారు.
అంటే వాళ్ళు కేసీయార్ ను వదిలేసినట్లే అనుకోవాలి. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ తో ఎవరు చేతులు కలుపుతారు ? అసలే జాతీయరాజకీయాల్లో కేసీయార్ కు క్రడిబులిటి చాలా తక్కువ. కేసీయార్ ఏరోజు ఎవరితో ఉంటారో ? ఎప్పుడేమి మాట్లాడుతారో కూడా ఎవరూ ఊహించలేరు. ఆ వైఖరి తెలంగాణాలో చెల్లుతాయేమో కానీ జాతీయ రాజకీయాలో చెల్లవు. అయినా కేసీయార్ తన ధోరణిలోనే తాను ముందుకెళుతున్నారు. అందుకనే చాలామంది దూరంగా పెట్టేశారు. మరి చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.
This post was last modified on May 19, 2023 12:53 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…