ఏమాటకామాట చెప్పుకోవాలి తెలంగాణలో సీనియర్లు ఎవరూ సహకరించకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ కేసీఆర్తో నిత్యం తలపడుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎలా అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ బట్టలూడదీయడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు.. డీకే తరహాలోనే ఎంత డబ్బయినా ఖర్చు చేసి ఎన్నికలలో విజయం సాధించడానికి ముందుకెళ్తున్నారు.
సీనియర్ల నుంచి సహకారం లేకపోయినా రాహుల్ గాంధీ దగ్గర పట్టు సంపాదించడంతో పాటు రాష్ట్రంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటుచేసుకుని కేసీఆర్తో తలపడుతున్నారు రేవంత్ రెడ్డి. కానీ… కర్ణాటకలో అంతా తానై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన డీకే శివకుమార్కు అంతా ముగిశాక సీఎం సీటు ఇవ్వకుండా మొండిచేయి చూపించినట్లే తెలంగాణలో ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ను సీఎం సీటుకు దూరం చేస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్పై ఈడీ, సీబీఐ కేసులు ఉండడంతో బీజేపీ వాటిని అడ్డంపెట్టుకుని ఇబ్బంది పెడుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సీఎం చేయలేదన్నవాదన ఒకటి ఉంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డిపైనా టీడీపీలో ఉన్నప్పటి నాటి ఓటుకు నోటు కేసు ఉంది. అంతేకాదు.. పార్టీ గెలిచాక అంతా తమ ఘనతే అని చెప్పుకొనే సీనియర్ల బ్యాచ్ కూడా అడ్డం తిరుగుతుందన్న అంచనాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఇలా, ఒకరేమిటి సక్సెస్ సాధించాలే కానీ దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యే సీనియర్లు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి కూడా తన మిత్రుడు శివకుమార్కు జరిగిన అనుభవం చూసిన తరువాత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ నుంచి కూడా సీఎం సీటు విషయంలోనూ హామీ తీసుకోవాలనుకుంటున్నారని.. లేదంటే శివకుమార్ మాదిరిగానే తానూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తన సన్నిహితులు వద్ద బయటపడినట్లు సమాచారం. అయితే, నాన్చుడు బేరంలో నంబర్ 1 అయిన సోనియా, రాహుల్ గాంధీలు రేవంత్కు అలాంటి హామీ ఇస్తారా అనేదీ అనుమానమే. ఒకవేళ హామీ ఇచ్చాక మిగతా కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో సహకరిస్తారా అనేదీ అనుమానమే.
This post was last modified on May 18, 2023 5:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…