పార్టీ ఆఫీసులో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో పార్టీకి 105 సీట్లు వస్తాయని ప్రకటించారు. 119 సీట్లలో 105 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయనటం మామూలు విషయం కాదు. కేసీయార్ చెప్పిన లెక్క కరెక్టయితే బీఆర్ఎస్ కు దాదాపు 90 శాతం సీట్లు వస్తాయని అనుకోవాలి. మరి నిజంగానే అన్ని సీట్లు వస్తాయా ? క్షేత్రస్ధాయిలో బీఆర్ఎస్ కు అంత సీనుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కొద్దిరోజుల క్రితం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతు సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో 45 మంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు స్వయంగా కేసీయారే చెప్పారు. అంతమంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు కేసీయారే చెప్పారంటే వాళ్ళ అవినీతి ఇంకా ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. జనాల్లో కేసీయార్ పాలనపైన బాగా వ్యతిరేకత ఉందనటంలో సందేహంలేదు.
ఆటో డ్రైవర్లు, తోపుడు బండ్లవాళ్ళు, మార్కెట్లో కూరగాయల వర్తకులు..ఇలా ఎవరిని కదిలించినా కేసీయార్ ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఇదే మంట వచ్చేఎన్నికల్లో ఓట్లు వేసేటపుడు చూపుతారో లేదో తెలీదు. ఇప్పటికైతే మండిపోతున్నది వాస్తవం. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉన్నది వాస్తవమే అని ప్రశాంత్ కిషోర్ ఆమధ్య నిర్వహించిన సర్వేల్లో కూడా బయటపడిందని వార్తలు వినిపించాయి. ఏ విధంగా చూసినా కేసీయార్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంటే మరి 105 సీట్లు ఎలాగ వస్తాయి ?
వ్యతిరేకత ఉన్నా అధికారంలోకి వస్తే రావచ్చు చెప్పలేం. ఎందుకంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవటం వల్ల బీఆర్ఎస్ లాభపడితే లాభపడచ్చు. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. కాకపోతే బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలుస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని కేసీయార్ చెప్పటాన్ని చాలామంది నమ్మటంలేదు. పార్టీ మీటింగులో చెప్పారు కానీ నిజంగానే అన్నిసీట్లు వస్తాయని కేసీయార్ కన్నా నమ్మకం ఉందా అనే డౌటు పెరిగిపోతోంది. మరి కేసీయార్ జోస్యం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 18, 2023 2:37 pm
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…