జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోకీలక భూమిక పోషించాలని తపిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే పొత్తుల లెక్కను ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తుగా చెప్పే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జనసైనికులకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్లైంది.
గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఒక్క సీటు మాత్రమే దక్కించుకోవటం తెలిసిందే. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ సొంతంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలు కావటం తెలిసిందే. పార్టీ గుర్తింపు కోసం అవసరమైనన్నిఓట్లు.. సీట్లు సాధించకపోవటంతో ఈసీ పవన్ పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా మార్చింది. ఈ నిర్ణయంతో ఏపీలో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఎవరికైనా ఈ గుర్తును పొందే అవకాశం ఉంటుంది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ.. ప్రాంతీయ పార్టీలనుఎన్నికల సంఘం ప్రకటించగా.. అందులో 8 పార్టీలు జాతీయ హోదా దక్కించుకోగా.. ఐదు పార్టీలకు ప్రాంతీయ హోదాను కల్పించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పేరు ఈ జాబితాలో లేకపోవటం షాకింగ్ గా మారింది. 2024లో టీడీపీతో పొత్తుకు వెళ్లే జనసేనకు తాజా పరిణామం ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
ఈసీ నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు పడాలి. అదే సమయంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇది జరిగితేనే.. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చినప్పటికి రెండు ఎమ్మెల్యే సీట్లను గెలవకపోవటంతో.. పార్టీ గుర్తును ఫ్రీ సింబల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 25 ఎంపీస్థానాల్లో ఏ ఒక్క దానిలో విజయం సాధించినా.. సింబల్ ఉండేది. కానీ.. అలా కూడా జరగలేదు. తాజా పరిణామంపై పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారు. ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on May 17, 2023 4:45 pm
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…