జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోకీలక భూమిక పోషించాలని తపిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే పొత్తుల లెక్కను ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తుగా చెప్పే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జనసైనికులకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్లైంది.
గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఒక్క సీటు మాత్రమే దక్కించుకోవటం తెలిసిందే. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ సొంతంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలు కావటం తెలిసిందే. పార్టీ గుర్తింపు కోసం అవసరమైనన్నిఓట్లు.. సీట్లు సాధించకపోవటంతో ఈసీ పవన్ పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా మార్చింది. ఈ నిర్ణయంతో ఏపీలో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఎవరికైనా ఈ గుర్తును పొందే అవకాశం ఉంటుంది.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ.. ప్రాంతీయ పార్టీలనుఎన్నికల సంఘం ప్రకటించగా.. అందులో 8 పార్టీలు జాతీయ హోదా దక్కించుకోగా.. ఐదు పార్టీలకు ప్రాంతీయ హోదాను కల్పించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పేరు ఈ జాబితాలో లేకపోవటం షాకింగ్ గా మారింది. 2024లో టీడీపీతో పొత్తుకు వెళ్లే జనసేనకు తాజా పరిణామం ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
ఈసీ నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు పడాలి. అదే సమయంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇది జరిగితేనే.. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చినప్పటికి రెండు ఎమ్మెల్యే సీట్లను గెలవకపోవటంతో.. పార్టీ గుర్తును ఫ్రీ సింబల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 25 ఎంపీస్థానాల్లో ఏ ఒక్క దానిలో విజయం సాధించినా.. సింబల్ ఉండేది. కానీ.. అలా కూడా జరగలేదు. తాజా పరిణామంపై పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారు. ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on May 17, 2023 4:45 pm
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…