Political News

త‌మ్ముళ్లూ.. తెలుసుకోండ‌యా.. అమ్మను ప్ర‌చారం చేయండ‌యా..!

అమ్మ‌ ఏపీలో అమ్మ‌తో రాజ‌కీయాలు చేయ‌డం వైసీపీ నుంచే ప్రారంభ‌మైంది. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా అమ్మ‌ను రాజ‌కీయాల్లో తిప్పింది లేదు. రాజ‌కీయంగా వాడుకున్న‌దీ లేదు. కానీ, గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను రాజ‌కీయంగా ఊరూ వాడా తిప్పారు. బైబిల్ చేత ప‌ట్టుకుని ఆమె ప్ర‌చారం చేశారు. వ‌య‌సు కారణంగా కొంత ఇబ్బంది ప‌డినా.. ఆమె త‌న కుమారుడి కోసం క‌ష్ట‌ప‌డ్డారు. తొలి ద‌శ‌లో పార్టీ ఓడిపోయినా.. 2019లో మాత్రం ఆమె చేసిన ప్ర‌చారం క‌లిసి వ‌చ్చింది.

క‌ట్ చేస్తే.. వైసీపీలో అమ్మ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు చేశార‌నే చెప్పాలి. జ‌గ‌న్ కోసం.. ఆమె ప్ర‌త్య‌క్షంగానే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. ఓట్లు అభ్య‌ర్థించారు. త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. కోసం కూడా ఎప్పుడూ ఆమె బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, తాజాగా టీడీపీ విష‌యానికి వ‌స్తే..ఇక్క‌డ కూడా అమ్మ రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కోసం.. ఆయ‌న మాతృమూర్తి భువ‌నేశ్వ‌రి.. దిగి వ‌చ్చారు. 100 రోజుల పాద‌యాత్ర‌లో ఆమెపాదం క‌దిపారు.. కుమారుడితో క‌లిసి.. అడుగులు వేశారు.

ఇక‌, దీనిలో మ‌సాలా .. ఏంటంటే.. న‌డిరోడ్డు పై అమ్మ‌కు షూ తొడ‌గ‌డం.. వాటికి లేసులు క‌ట్ట‌డం.. దీనికి పెద్ద ఫొటో షూట్ పెట్టడం. త‌ప్పుకాదు. గ‌తంలో భార‌త్ జోడో యాత్ర జ‌రిగిన‌ప్పుడు రాహుల్‌గాంధీ అంత‌టి వాడే త‌న మాతృమూర్తి సోనియా గాంధీకి లేసులు క‌ట్టి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్నం చేశారు. కాబ‌ట్టి టీడీపీ యువ నాయ‌కుడు ఆ కోణంలో ప్ర‌య‌త్నించార‌నే వాద‌న‌లోనూ త‌ప్పు క‌నిపించ‌డం లేదు. ఇక‌, టీడీపీలో అమ్మ కోణం ఇక్క‌డితో అయిపోలేదు. త‌ర‌చుగా నారా లోకేష్ చెబుతున్న‌ట్టుగా.. త‌న అమ్మ‌ను విమ‌ర్శించిన‌.. దుర్మార్గంగా మాట్లాడిన వారికి ఆయ‌న బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

అంటే.. మొత్తంగా టీడీపీలోనూ అమ్మ రాజ‌కీయంగా కేంద్రం అయింది. అయితే.. ఈ కోణాన్ని.. త‌మ్ముళ్లు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడేవారే లేరు. అమ్మ సెంటిమెంటును ప‌ట్టించుకుంటున్న‌వారే క‌నిపించ‌డం లేదు. గ‌తంలో వైసీపీలో అయితే.. విజ‌య‌మ్మ కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రిగాయి. ఆమె సెంటిమెంటును బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. కానీ, ఇప్పుడు టీడీపీ తెలుగు త‌మ్ముళ్లు క‌ళ్లు తెర‌వాలి. అమ్మ రాజ‌కీయాన్ని విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. అందుకే త‌మ్ముళ్లూ.. తెలుసుకోండ‌యా.. అమ్మను ప్ర‌చారం చేయండ‌యా!! అంటున్నారు సీనియ‌ర్లు.

Satya

Recent Posts

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

43 minutes ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

1 hour ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

2 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

2 hours ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

2 hours ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

2 hours ago