Political News

జగన్ అభిమానులకు ఇది తగునా?

రాజకీయ నాయకుల మీద అభిమానం హద్దులు దాటితే, అధికార మదం తలకెక్కితే ఎలా ఉంటుందనడానికి ఇది తాజాగా ఉదాహరణ. ప్రస్తుతం తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడ గంగమ్మ గుడిని కనువిందు చేసేలా అలంకరించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఆ గుడిలో జగన్ అభిమానులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు.

ముఖ ద్వారం వద్ద చేసిన పూల అలంకరణలో J అక్షరం.. దాని పక్కన గన్ సింబల్ పెట్టారు. అంటే దాన్ని ‘జగన్’ అని చదువుకోవాలన్నమాట. దీంతో పాటుగా వైసీపీ జెండా రంగులు కూడా ఎలివేట్ అయ్యేలా ఈ అలంకరణ చేశారు. దేవుడి గుడిలో ఇలా సీఎం జగన్ పేరుతో పూల అలంకరణ చేయడమే అభ్యంతరకరం అంటే.. అందులో ‘గన్’ అనే పదం బదులు.. తుపాకీనే పెట్టడం మరీ విడ్డూరం. ఇది వైసీపీ వాళ్లకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. సామాన్య జనాలకు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగానే అనిపిస్తోంది.

తిరుపతి జనాలు ఈ విడ్డూరం చూసి విస్తుబోతున్నారు. దేవుడి గుడిలో ఈ ఆటలేంటి అని ఇలా చేసిన వారిని తూర్పారబడుతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వయంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించారు. ‘‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా?’’ అని ఆయన ట్వీట్ వేశారు.

తెలుగుదేశం, జనసేన వాళ్లే కాక చాలామంది ఈ విషయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. అసలే జగన్ సర్కారు మీద రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. తిరుమలలో కొన్నేళ్లుగా జరుగుతున్న అనేక అభ్యంతరకర విషయాల మీద జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఇప్పుడు తిరుపతి గంగజాతరలో ఇలా చేయడం జగన్ అండ్ కో మీద వ్యతిరేకతను మరింత పెంచేదే.

This post was last modified on May 17, 2023 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago