టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక, నందమూరి కుటుంబం, నారా ఫ్యామిలీ కూడా నారా లోకేష్తో కలిసి పాదయాత్రలో అడుగులు కదిపింది. మొత్తంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పసుపు జెండా రెపరెపలాడగా.. తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్రలతో కదం తొక్కారు. అయితే.. ఈ పాదయాత్రపై తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సటైర్లు వేశారు.
లోకేష్ పాదయాత్ర నూరురోజు లైనా, వెయ్యి రోజులైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యానించారు. తండ్రి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడానికే ఈ యాత్ర చేపట్టారని విమర్శించారు. టీడీపీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేకపోయిందని విమర్శించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్ పాదయాత్ర వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదన్నారు.
ప్రొద్దుటూరుకు లోకేష్ పాదయాత్ర వస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. లోకేష్ పాదయాత్రతో తనకు వచ్చేనష్టం లేదని.. ‘‘అల్లుడిలా వస్తాడు వెళతాడు’’ అంటూ ఎమ్మెల్యే రాచమల్లు సటైర్లు వేశారు. ఇప్పటి వరకు పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో ఎవరైనా ఒక్కరైనా నాయకులు వచ్చి టీడీపీలో చేరారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎవరో ఒకరిని రోజూ తీసుకువచ్చి పాదయాత్ర సక్సెస్ అయిందని చూపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినా.. తాను ఎట్టి పరిస్థితిలోనూ అడ్డు చెప్పనని.. అలా చేస్తే.. లేనిపోని మైలేజీ ఇచ్చిన వాడిని అవుతానని అన్నారు.
This post was last modified on May 16, 2023 10:59 am
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…