Political News

వివేకా హత్య కేసులో రెండు కీలక పరిణామాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి షాకులుగా మారినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ ను మరోసారి తమ ఎదుట హాజరు కావాలని.. విచారణ కోసం తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలన్నది నోటీసులు సారాంశం.

దీంతో.. సీబీఐ నోటీసులకు స్పందించిన అవినాశ్ రెడ్డి.. హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్యన రోజుకో పరిణామంతో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పరుగులు తీసినట్లుగా కనిపించింది. దీనికి తోడు అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయటం.. అవినాశ్ ను అరెస్టుచేయాల్సిందేనని ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు సీబీఐ వెల్లడించటం తెలిసిందే.

ఆ తర్వాత.. ఈ కేసు విచారణ స్తబ్దుగా మారినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలోనే మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితులు.. వివేకా హత్య కేసులో ఏ6గా ఉన్న గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ కు నో చెప్పింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

వివేకా హత్య అనంతరం.. సాక్ష్యాల్ని నాశనం చేయటంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియటానికి ముందే ఉదయ్.. ఎంపీ అవినాశ్ ఇంట్లో ఉన్నట్లుగా సీబీఐ చెబుతోంది. హత్య రోజు తెల్లవారుజామున 3.40 గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొంది.

వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు కట్లు కట్టడం.. ఆయన భౌతికకాయాన్ని ఫ్రీజర్ లో ఉంచే ఏర్పాట్లు చేయటం.. ఇతర ఆధారాల్ని చెరిపేసే ఉదంతంలో ఆయన కీలకభూమిక పోషించారన్నది ఆయన మీద ఆరోపణలు. ఏప్రిల్ 14న సీబీఐ అతడ్ని అరెస్టు చేసింది. కస్టడీ ముగిసిందని.. విచారించేందుకు ఇంకేమీ లేదని.. అందుకే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా జరిపిన విచారణలో బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది.

This post was last modified on May 16, 2023 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago