ఏపీ సీఎం జగన్కు ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఝలక్ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోసిన అక్కడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనను డియర్ బ్రదర్ అని సంబోధించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం(మే 15) డీకే శివకుమార్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన మద్దతు దారులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ , ఆమె పెట్టిన ఫొటో రెండూకూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. సీఎం జగన్ వరుసకు ఆమెకు అన్నయ్య అవుతాడు. అయితే.. ఇటీవల కాలంలో రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు.. రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలకమైన కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. పలు విషయాల్లోనూ ఆమె జగన్ నిర్ణయాలపై విభేదిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా డీకేను అన్నయ్య అని సంబోధించడం.. గమనార్హం.
ఇంతకీ షర్మిల ఏమన్నారంటే.. ప్రియమైన డీకే శివకుమార్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. అంతేకాదు, జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు కూడా! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మీకు మరింత ఆయుర్ధాయం ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలతో కర్ణాటక ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని షర్మిల పేర్కొన్నారు.
This post was last modified on May 15, 2023 10:16 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…