ఏపీ సీఎం జగన్కు ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఝలక్ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోసిన అక్కడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనను డియర్ బ్రదర్ అని సంబోధించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం(మే 15) డీకే శివకుమార్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన మద్దతు దారులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ , ఆమె పెట్టిన ఫొటో రెండూకూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. సీఎం జగన్ వరుసకు ఆమెకు అన్నయ్య అవుతాడు. అయితే.. ఇటీవల కాలంలో రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు.. రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలకమైన కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. పలు విషయాల్లోనూ ఆమె జగన్ నిర్ణయాలపై విభేదిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా డీకేను అన్నయ్య అని సంబోధించడం.. గమనార్హం.
ఇంతకీ షర్మిల ఏమన్నారంటే.. ప్రియమైన డీకే శివకుమార్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. అంతేకాదు, జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు కూడా! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మీకు మరింత ఆయుర్ధాయం ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలతో కర్ణాటక ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని షర్మిల పేర్కొన్నారు.
This post was last modified on May 15, 2023 10:16 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…