ఏపీ సీఎం జగన్కు ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఝలక్ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోసిన అక్కడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనను డియర్ బ్రదర్ అని సంబోధించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం(మే 15) డీకే శివకుమార్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన మద్దతు దారులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ , ఆమె పెట్టిన ఫొటో రెండూకూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. సీఎం జగన్ వరుసకు ఆమెకు అన్నయ్య అవుతాడు. అయితే.. ఇటీవల కాలంలో రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు.. రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలకమైన కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. పలు విషయాల్లోనూ ఆమె జగన్ నిర్ణయాలపై విభేదిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా డీకేను అన్నయ్య అని సంబోధించడం.. గమనార్హం.
ఇంతకీ షర్మిల ఏమన్నారంటే.. ప్రియమైన డీకే శివకుమార్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. అంతేకాదు, జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు కూడా! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మీకు మరింత ఆయుర్ధాయం ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలతో కర్ణాటక ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని షర్మిల పేర్కొన్నారు.
This post was last modified on May 15, 2023 10:16 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…