ఏపీ సీఎం జగన్కు ఆయన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఝలక్ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోసిన అక్కడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్కు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనను డియర్ బ్రదర్ అని సంబోధించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం(మే 15) డీకే శివకుమార్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన మద్దతు దారులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ , ఆమె పెట్టిన ఫొటో రెండూకూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. సీఎం జగన్ వరుసకు ఆమెకు అన్నయ్య అవుతాడు. అయితే.. ఇటీవల కాలంలో రెండేళ్లుగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు.. రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలకమైన కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. పలు విషయాల్లోనూ ఆమె జగన్ నిర్ణయాలపై విభేదిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా డీకేను అన్నయ్య అని సంబోధించడం.. గమనార్హం.
ఇంతకీ షర్మిల ఏమన్నారంటే.. ప్రియమైన డీకే శివకుమార్ అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. అంతేకాదు, జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు కూడా! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. మీకు మరింత ఆయుర్ధాయం ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయురారోగ్యాలతో కర్ణాటక ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని షర్మిల పేర్కొన్నారు.
This post was last modified on May 15, 2023 10:16 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…