Political News

వైఎస్‌కు నివాళుల‌ర్పించిన నారా లోకేష్‌.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. ఆదివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని నల్లకాలువ పంచాయతీ పరిధిలో నారాలోకేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కొద్దిసేపు ఆగి నివాళులర్పించారు.

అనంతరం నారా లోకేష్‌ పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితే.. రాజ‌కీయంగా చూస్తే.. వైఎస్ తో టీడీపీకి కూడా వైరం ఉంది. వైఎస్ జీవించిన కాలంలో కాంగ్రెస్ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు జోరుగా సాగాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు 2004లో రాజ‌శేఖ‌రరెడ్డి పాద‌యాత్ర కూడా చేశారు. చివ‌ర‌కు చంద్ర‌బాబును గ‌ద్దెదింపే వ‌ర‌కు నిద్ర‌పోలేదు.

ఆ త‌ర్వాత 2009లోనూ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబు గెల‌వ‌కుండా.. ఒక అగ్ర న‌టుడితో పార్టీ పెట్టించార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇంత వైరం ఉన్న‌ప్ప‌టికీ.. చ‌నిపోయిన నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌రాద‌ని.. వారిని గౌర‌వించాల‌నే సూత్రాన్ని నారా లోకేష్ పాటించ‌డం.. త‌న పాద‌యాత్ర మార్గ మ‌ధ్యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతి వ‌నాన్ని ద‌ర్శించి నివాళుల‌ర్పించడం.. నారాలోకేష్ రాజ‌కీయ విజ్ఞ‌త‌కు మ‌చ్చుత‌న‌క అని టీడీపీ నాయ‌కులు పేర్కొంటున్నారు.

This post was last modified on May 14, 2023 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

2 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

5 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

8 hours ago