టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. ఆదివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని నల్లకాలువ పంచాయతీ పరిధిలో నారాలోకేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కొద్దిసేపు ఆగి నివాళులర్పించారు.
అనంతరం నారా లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితే.. రాజకీయంగా చూస్తే.. వైఎస్ తో టీడీపీకి కూడా వైరం ఉంది. వైఎస్ జీవించిన కాలంలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ రాజకీయాలు జోరుగా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు 2004లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర కూడా చేశారు. చివరకు చంద్రబాబును గద్దెదింపే వరకు నిద్రపోలేదు.
ఆ తర్వాత 2009లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గెలవకుండా.. ఒక అగ్ర నటుడితో పార్టీ పెట్టించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంత వైరం ఉన్నప్పటికీ.. చనిపోయిన నాయకులను విమర్శించరాదని.. వారిని గౌరవించాలనే సూత్రాన్ని నారా లోకేష్ పాటించడం.. తన పాదయాత్ర మార్గ మధ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనాన్ని దర్శించి నివాళులర్పించడం.. నారాలోకేష్ రాజకీయ విజ్ఞతకు మచ్చుతనక అని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.
This post was last modified on May 14, 2023 3:56 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…