Political News

చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్ చేసిన ఏపీ సీఐడీ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నివాస‌రం ఉంటున్న ఉండ‌వ‌ల్లిలోని కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెం డ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం సీఐడీ అధికారులు ఈ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ.. తాజాగా ఆదివారం ఉద‌యం నోటీసులు అంటించారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ అల‌జ‌డి చెల‌రేగింది.

సీఐడీ అధికారుల వాద‌న ఇదీ..

చంద్ర‌బాబు నివాసాన్ని అటాచ్‌(స్వాధీనం/జ‌ప్తు) చేసిన అధికారులు.. దీనికి కార‌ణాలు పేర్కొన్నారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవ కలకు పాల్పడి.. దానికి బదులుగా కరకట్టపై ఉన్న‌ లింగమనేని గెస్ట్‌హౌస్ క్విడ్ ప్రోకో(నాక‌ది-నీకిది) కింద‌ పొందారని అభియోగాలు మోపారు. చట్టాలను, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొన్నారు.  

చంద్ర‌బాబు, నారాయ‌ణ‌లు తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు న‌మోదైన‌ట్టు సీఐడీ అధికారులు తెలిపారు.  రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని తాము( సీఐడీ) కోరిన‌ట్టు అధికారులు అంటించిన నోటీసులో పేర్కొన్నారు. త‌మ విజ్ఞ‌ప్తికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అంగీక‌రించింద‌ని, దీంతో చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన‌ట్టు పేర్కొన్నారు. కానీ, ఈ విష‌యాన్ని ముందుగానే  స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చిన‌ట్టు సీఐడీ అధికారులు నోటీసులో వివ‌రించారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఇంకా స్పందించ‌లేదు.

This post was last modified on May 14, 2023 1:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

2 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

5 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

8 hours ago