ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నివాసరం ఉంటున్న ఉండవల్లిలోని కరకట్టపై ఉన్న గెస్ట్హౌస్ను అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెం డ్మెంట్ 1944 చట్టం ప్రకారం సీఐడీ అధికారులు ఈ గెస్ట్హౌస్ను అటాచ్ చేస్తూ.. తాజాగా ఆదివారం ఉదయం నోటీసులు అంటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ అలజడి చెలరేగింది.
సీఐడీ అధికారుల వాదన ఇదీ..
చంద్రబాబు నివాసాన్ని అటాచ్(స్వాధీనం/జప్తు) చేసిన అధికారులు.. దీనికి కారణాలు పేర్కొన్నారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్లలో అవకతవ కలకు పాల్పడి.. దానికి బదులుగా కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్హౌస్ క్విడ్ ప్రోకో(నాకది-నీకిది) కింద పొందారని అభియోగాలు మోపారు. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని పేర్కొన్నారు.
చంద్రబాబు, నారాయణలు తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలు నమోదైనట్టు సీఐడీ అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని తాము( సీఐడీ) కోరినట్టు అధికారులు అంటించిన నోటీసులో పేర్కొన్నారు. తమ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అంగీకరించిందని, దీంతో చంద్రబాబు గెస్ట్హౌస్ను అటాచ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ, ఈ విషయాన్ని ముందుగానే స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చినట్టు సీఐడీ అధికారులు నోటీసులో వివరించారు. దీనిపై టీడీపీ నాయకులు ఇంకా స్పందించలేదు.
This post was last modified on May 14, 2023 1:35 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…