ఏపీలో పుంజుకోవాలన్నా.. కనీసం.. ఉనికిని నిలబెట్టుకోవాలన్నా.. బీజేపీకి ముందున్న ఏకైక మార్గం.. పొత్తు లేనని అంటున్నారు పరిశీలకులు. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తమను కాపాడుతుందని.. ఏపీలో నూ తమను గట్టెక్కిస్తుందని ఆశలు పెట్టుకుని.. ఇలానే పొత్తుల విషయంలో భీష్మించుకుని కూర్చుంటే.. మొత్తానికే మోసం ఖాయమని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు.
ఢిల్లీ టు బెంగళూరు, ఢిల్లీ టు మైసూరు అంటూ.. 19 సార్లు ఆయన కేవలం 25 రోజుల్లో పర్యటించారు. అంతేకాదు.. 6 ప్రధాన రోడ్ షోలు చేశారు. వీటిలో రెండు ఏకంగా 8 గంటల పాటు సాగాయి. ఇక, 5 బహిరంగ సభల్లో 4 గంటల 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మొత్తంగా రాష్ట్ర ఎన్నికలను ఆయన తన అధీనంలో కి తీసుకున్నారు. తన ఇమేజ్తో పార్టీని గెలిపిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. అదేసయమంలో టిప్పు సుల్తాన్ రాజకీయాలు తీసుకువచ్చారు. హిజాబ్ సహా ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయడం ప్రస్తావించారు.
మొత్తంగా చూస్తే.. మోడీ ఇమేజ్ సహా ఆయన ప్రకటిత పథకాలు తమను విజయతీరాలవైపు తీసుకువెళ్తా యని అనుకున్నారు. కానీ, కన్నడిగులు మోడీని నమ్మలేదు. బీజేపీకి ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. ఈ ఫలితాల అనంతరం.. ఇక, ఇప్పుడు తేలిపోయిన విషయం ఒక్కటే ఒక్కటి .. మోడీతో బీజేపీ ఇమేజ్ పెరగేది లేదు. క్షేత్రస్థాయి బలం.. కార్యకర్తలు.. వ్యూహాలే పార్టీని ముందుకు నడిపిస్తాయనేది స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో 2024లో జరగనున్న లేదా.. అంతకన్నా ముందే వస్తాయని భావిస్తున్న ఏపీలో బీజేపీ ఏవిధంగా అడుగులు వేయాలనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తాము జనసేనతో తప్ప ఎవరితోనూ కలిసి నడిచేది లేదని చెప్పిన.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టంగ్ మార్చారు. జనసేన అధినేత చెప్పిన పొత్తుల విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తేనే.. పొత్తుల దిశగా పావులు కదిపితేనే.. బీజేపీ ఇమేజ్ ఏమైనా నిలబడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on May 14, 2023 12:07 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…