అధికార పార్టీగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనతా పార్టీకి దారుణమైన పరాజయాన్ని రుచి చూపించారు కన్నడిగలు. అయితే.. ఇందులో తెలుగోళ్ల పాత్ర తక్కువేం కాదన్న విషయం ఇప్పుడుబయటకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మహా నగరంలో తెలుగు వారితో పాటు ఉత్తరాది వారు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. ఇక.. కర్ణాటకలోని చాలా జిల్లాల్లో తెలుగువారి ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు భారీగానే ఉన్నాయి.
ఇలాంటి చోట్ల.. వచ్చిన ఫలితం చూస్తే.. కాంగ్రెస్ తాజా విజయంలో తెలుగువారుకీలక భూమిక పోషించిన వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బెంగళూరుతో పాటు.. తెలుగు వారు ఎక్కువగా నివసించే జిల్లాలు కర్ణాటకలో దాదాపు పది వరకు ఉన్నాయనే చెప్పాలి. ఈ జిల్లాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు చాలా తక్కువ. మొత్తం పది జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం.. మిగిలిన ఆరు జిల్లాల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న జిల్లాలు మూడు ఉంటే.. మిగిలిన మూడు జిల్లాల్లో రెండేసి స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు.
ఈ పది జిల్లాల్లో మొత్తం 63 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ గెలిచింది మాత్రం కేవలం 9 స్థానాల్లోనే. ఒక విధంగా చెప్పాలంటే.. బీజేపీ దారుణ పరాజయంలో ఈ పది జిల్లాలు కీలక భూమిక పోషించాయని చెప్పాలి. ఇంతకూ ఆ 10 జిల్లాలు.. వాటిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. బీజేపీ గెలిచిన స్థానాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగు వారి కొట్టిన దెబ్బ ఎంతన్నది తెలుస్తుంది.
జిల్లా పేరు | అసెంబ్లీ స్థానాలు | బీజేపీ గెలిచిన స్థానాలు |
బళ్ళారి | 5 | 0 |
చిక్కబళ్ళాపూర్ | 5 | 0 |
చిత్రదుర్గా | 6 | 1 |
కాలబురుగి | 9 | 2 |
కొప్పల్ | 5 | 1 |
కోలార్ | 6 | 0 |
రాయచూర్ | 7 | 2 |
తుంకూరు | 11 | 2 |
విజయనగర | 5 | 1 |
మొత్తం 63 స్థానాలకు గెలిచింది ‘9’. బెంగళూరు మహానగరంలో ఉత్తర భారతానికి చెందిన వారు ఎక్కువమంది ఉండటంతో బీజేపీ ఎక్కువ స్థానాల్ని అక్కడ గెలవగిలింది. అదే సమయంలో కన్నడిగులు..తెలుగు వారి ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ దారుణ పరాజయం పాలైంది. కాంగ్రెస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.
This post was last modified on May 14, 2023 11:50 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…