Political News

కర్ణాటకలో బీజేపీని దారుణంగా దెబ్బ తీసిన తెలుగోళ్లు

అధికార పార్టీగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన భారతీయ జనతా పార్టీకి దారుణమైన పరాజయాన్ని రుచి చూపించారు కన్నడిగలు. అయితే.. ఇందులో తెలుగోళ్ల పాత్ర తక్కువేం కాదన్న విషయం ఇప్పుడుబయటకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మహా నగరంలో తెలుగు వారితో పాటు ఉత్తరాది వారు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. ఇక.. కర్ణాటకలోని చాలా జిల్లాల్లో తెలుగువారి ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు భారీగానే ఉన్నాయి.

ఇలాంటి చోట్ల.. వచ్చిన ఫలితం చూస్తే.. కాంగ్రెస్ తాజా విజయంలో తెలుగువారుకీలక భూమిక పోషించిన వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బెంగళూరుతో పాటు.. తెలుగు వారు ఎక్కువగా నివసించే జిల్లాలు కర్ణాటకలో దాదాపు పది వరకు ఉన్నాయనే చెప్పాలి. ఈ జిల్లాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు చాలా తక్కువ. మొత్తం పది జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం.. మిగిలిన ఆరు జిల్లాల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న జిల్లాలు మూడు ఉంటే.. మిగిలిన మూడు జిల్లాల్లో రెండేసి స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు.

ఈ పది జిల్లాల్లో మొత్తం 63 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ గెలిచింది మాత్రం కేవలం 9 స్థానాల్లోనే. ఒక విధంగా చెప్పాలంటే.. బీజేపీ దారుణ పరాజయంలో ఈ పది జిల్లాలు కీలక భూమిక పోషించాయని చెప్పాలి. ఇంతకూ ఆ 10 జిల్లాలు.. వాటిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు.. బీజేపీ గెలిచిన స్థానాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగు వారి కొట్టిన దెబ్బ ఎంతన్నది తెలుస్తుంది.

జిల్లా పేరుఅసెంబ్లీ స్థానాలుబీజేపీ గెలిచిన స్థానాలు
బళ్ళారి50
చిక్కబళ్ళాపూర్50
చిత్రదుర్గా61
కాలబురుగి92
కొప్పల్51
కోలార్60
రాయచూర్72
తుంకూరు112
విజయనగర51

మొత్తం 63 స్థానాలకు గెలిచింది ‘9’. బెంగళూరు మహానగరంలో ఉత్తర భారతానికి చెందిన వారు ఎక్కువమంది ఉండటంతో బీజేపీ ఎక్కువ స్థానాల్ని అక్కడ గెలవగిలింది. అదే సమయంలో కన్నడిగులు..తెలుగు వారి ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ దారుణ పరాజయం పాలైంది. కాంగ్రెస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.

This post was last modified on May 14, 2023 11:50 am

Share

Recent Posts

పొలిమేరలో అర్జున్ అడుగు పెద్ద ప్లస్సు

హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…

4 minutes ago

సెప్టెంబర్ 11 – ఇంత రష్ అయితే ఎలా

ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…

15 minutes ago

ధనుష్ మీటింగ్… చాలా కథ ఉంది

తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…

25 minutes ago

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

1 hour ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

4 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago