Political News

జ‌గ‌న్‌కు భారీ షాక్.. జీవో 1ని కొట్టేసిన హైకోర్టు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. సీఎం జ‌గ‌న్ ఈ ఏడాది ప్రారంభంలో జ‌న‌వ‌రి 2వ తారీకు తీసుకువ‌చ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఈ జీవో ను జారీ చేశారు. దీనిపై ప‌ద్ద ఎత్తున తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీడీపీ, జ‌న‌సేనల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్ధం కూడా ఎదురైంది. అయినా.. స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు.

దీంతో ఈ జీవోను సవాల్‌ చేస్తూ టీడీపీ, వామ‌ప‌క్షాలు స‌హా ప్ర‌జాసంఘాల నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం తాజాగా శుక్ర‌వారం తీర్పు వెల్లడించింది. విచారణ సందర్భంగా.. “రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారు. పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో జారీ చేశారు” అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

జీవో మంట‌లు..

రహదారులపై బహిరంగ సమావేశాలు, ముఖ్యంగా రోడ్ షోలు.. నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.

పోలీసు చట్టం సెక్షన్‌ 30 ప్రకారం ‘కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి’ అని ఈ సెక్ష‌న్‌ చెబుతోందన్నారు. జీవో 1 దీనికి భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి’ అని చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను జీవో 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాలపై 2023 జనవరి 24న లోతైన విచారణ జరిపి తీర్పును నేటికి రిజర్వు చేసి.. జీవో నెంబర్1ను కొట్టివేసింది.

అయితే.. దీనిపై విచార‌ణ ఎప్పుడో పూర్త‌యినా.. తీర్పు ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ..కొల్లు ర‌వీంద్ర ఇటీవ‌ల సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు విష‌యాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో మే 30లోగా తీర్పు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టును ఆదేశించింది. ఈ క్ర‌మంలో తాజాగా కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇదిలావుంటే.. హైకోర్టు తీర్పుపై ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. 1835 నాటి బ్రిటీష్ చ‌ట్టాల‌ను అనుస‌రించి జ‌గ‌న్ స‌ర్కారు ఈ జీవోను తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 12, 2023 10:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago