తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందివచ్చిన పార్టీలతో కలిసి.. హస్తినలో అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. దీనికిగాను ప్రధానంగా.. కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్ను తనకు మిత్రపక్షంగా చేసుకుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కార్యక్రమాలు జరిగినా.. జేడీఎస్ కీలక నాయకుడు.. కుమారస్వామిని అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్.
అలా.. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామి.. ఇప్పుడు బీఆర్ఎస్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారనే చర్చ రాజకీయంగా ప్రాదాన్యం సంతరించుకుంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఒక పార్టీ.. ముఖ్యంగా ఒక కీలక నాయకుడు(పేరు చెప్పలేదు) పార్టీకి ఆర్థికంగా.. భౌతికంగా(ప్రచారం) కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ, ఆయన హామీని నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. అంటే.. కుమారకు అండగా ఉన్నది ఎవరు అంటే.. కేసీఆర్ మాత్రమే.
పరిస్థితులను గమనిస్తే.. కర్ణాటక ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున కూడా ప్రచారం చేస్తామని.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజున బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ప్రకటన వచ్చింది. కానీ నెల రోజులు సాగిన ప్రచారంలో ఎక్కడా బీఆర్ఎస్ ఊసు కర్ణాటకలో కనిపించలేదు. పైగా.. కుమారస్వామికి.. ఎక్కడా ఆర్థికంగా కూడా సాయం అందలేదన్నది.. ఆయన చెప్పిన మాటలను బట్టి తెలిసింది. ఈ నేపథ్యంలో రేపు హంగ్ వచ్చి.. కుమారస్వామికి ప్రాధాన్యం పెరిగితే.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
తద్వారా.. 2024 లోక్సభ ఎన్నికల్లో కుమారస్వామి ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మరి అప్పుడు బీఆర్ఎస్కు ఆయన ఏమేరకు సాయం చేస్తారు? ఎందుకు చేయాలి? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. రేపు హంగ్ వస్తే.. బీజేపీ లేదా.. కాంగ్రెస్తో జతకట్టే అవకాశంఉంటుంది. ఇదే జరిగితే.. బీఆర్ ఎస్కు పూర్తిగా కుమార దూరం ఖాయం. బహుశ ఇది గమనించే కేసీఆర్ దూరంగా ఉన్నారా? అనేది మరో ప్రశ్న. ఎలా చూసుకున్నా.. బీఆర్ ఎస్లో కుమారసంభవం.. సాధ్యం కాదనేవాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on May 12, 2023 10:54 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…