Political News

మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది

లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)ను అడ్డు పెట్టుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆడించినంత కాలం ఆడించారు నరేంద్రమోడీ. మోడీ ఆటలకు సుప్రింకోర్టు ధర్మాసనం చెక్ పెట్టేసింది. ఢిల్లీ రాష్ట్రంపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పేసింది. ఎల్జీ హోదాలో ప్రభుత్వాన్ని పక్కనపెట్టేసి పాలనలో, జనాలపై పెత్తనం చేస్తామంటే కుదరదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. పలనా వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని ధర్మాసనం స్పష్టంగా ప్రకటించింది.

విషయం ఏమిటంటే చాలాకాలంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే మోడీకి బాగా మంటుంది. వరుసగా మూడోసారి సీఎం అయిన కేజ్రీవాల్ ను చివరి రెండుసార్లు ఓడించేందుకు మోడీ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఆ మంటను మనసులో పెట్టుకుని ఎల్జీని అడ్డంపెట్టుకుని మోడీ బాగా ఇబ్బందులు పెడుతున్నారు. అసెంబ్లీ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్జీ దాన్ని అడ్డుకుంటున్నారు. తన ఆమోదముద్ర లేనకపోతే ఏ నిర్ణయం చెల్లదని, ఒక్క పనికూడా ముందుకు పోకూడదని ఎల్జీ పట్టుబట్టారు.

జనాల దృష్టిలో కేజ్రీని అసమర్ధుడిగా చిత్రీకరించటమే మోడీ టార్గెట్. ఎల్జీని అడ్డం పెట్టుకుని మోడీ తనను ఇబ్బందులు పెడుతుండటాన్న కేజ్రీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతునే ఉన్నారు. ఇందులో భాగంగానే సుప్రింకోర్టులో కేసు వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ తీర్పుచెబుతు ఎల్జీకి అన్నీ అధికారాలు ఉన్నాయని చెప్పింది. ఎల్జీ చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. దీనిపై కేజ్రీ రివ్యూ పిటీషన్ వేస్తే దాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

తన తాజా తీర్పులో సింగిల్ బెంచ్ తీర్పును రద్దుచేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రప్రభుత్వం నియమించిన ఎల్జీకి అధికారాలు ఎలాగుంటాయని నిలదీసింది. ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారీ కానీ ఎల్జీ కాదన్నది. అందుకనే ఎల్జీ పెత్తనం ఇక ఎంతమాత్రం చెల్లదని స్పష్టంగా చెప్పేసింది. తాజా తీర్పుతో మోడీకి వ్యతిరేకంగా కేజ్రీ రెచ్చిపోవటం ఖాయం. పార్లమెంటు ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు తీర్పు కేజ్రీకి పెద్ద బూస్టప్ ఇచ్చినట్లనే చెప్పాలి. మరి రాబోయే ఎన్నికల్లో కేజ్రీ ఏమిచేస్తారో చూడాలి.

This post was last modified on May 12, 2023 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago