అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం పట్టించునే పరిస్థితి రాలేదని అన్నారు. జనసేన పార్టీ పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే పొలాల వద్ద ఉన్న ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం సరిగా పనిచేస్తే తాను రంగంలోకి దిగేవాడిని కాదని చెప్పారు. ఈ విషయం గతంలో కూడా చెప్పానన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే రైతులను అణిచేయాలని చూస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని తెలిపారు. ధాన్యం కొన్నవారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడం లేదన్నారు.
క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించలేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్లినా కారణం లేకుండానే రైతులను అరెస్టు చేస్తున్నారని.. అందుకే తాను క్షేత్రస్థాయిలో పర్యటనలకు రావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. “మాకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే రైతులపై కేసులు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయి.” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
This post was last modified on May 12, 2023 11:02 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…