ఏపీ సీఎం జగన్ .. మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే ఏకైక లక్ష్యంతో విజయవాడ వేదికగా.. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టినట్టు దేవదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. కానీ, అంతర్లీనంగా సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే సంకల్పంతోనే ఈ యాగానికి రూపకల్పన చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలావుంటే, ఈ యాగం కోసం.. సుమారు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులను దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాలపై వేయడం విమర్శలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆర్జేసీ, ఉపకమిషనర్ కేడర్ దేవాలయాలు 5 వేల కరపత్రాలు, 2 వేల వాల్పోస్టర్లు, పది పెద్ద హోర్డింగ్లు, 50 ఫ్లెక్సీలు, 50 బ్యానర్లు ముద్రించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక సహాయ కమిషనర్, గ్రేడ్ 1, 2, 3 దేవాలయాలు 2 వేల కరపత్రాలు, 1000 వాల్పోస్టర్లు, ఐదు పెద్ద హోర్డింగ్లు, 20 ఫ్లెక్సీలు, 25 బ్యానర్లను ముద్రించాలని పేర్కొన్నారు.
అసలు జగన్ మరోసారి సీఎం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న యాగానికి దేవాలయాల నిధుల నుంచి ప్రచార సామగ్రిని ముద్రించడం ఏమిటని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ యాగానికి మొత్తం రూ.10 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు దేవదాయ శాఖ తెలిపింది. వివిధ దేవాలయాల నుంచి నిధులు మళ్లిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో దేవదాయ శాఖ పరిధిలోని ఒక్కో ఆలయంపై రూ.30 లక్షల భారం పడుతుందని ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి మళ్లీ జగన్ సీఎం అవుతారో లేదో తెలియదు కానీ.. అంతో ఇంతో నడుస్తున్న ఆలయాలు మాత్రం ఈ దెబ్బతో అప్పుల కుప్పలుగా మారడం ఖాయమని అంటున్నారు టీడీపీ నాయకులు.
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…