Political News

జ‌గ‌న్ కోసం ‘యాగం’.. ఒక్కొక్క ఆయ‌లంపై 30 ల‌క్ష‌ల భారం?

ఏపీ సీఎం జ‌గ‌న్ .. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో విజ‌య‌వాడ వేదిక‌గా.. శుక్ర‌వారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్‌ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టినట్టు దేవదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. కానీ, అంత‌ర్లీనంగా సీఎం జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించాల‌నే సంక‌ల్పంతోనే ఈ యాగానికి రూప‌క‌ల్ప‌న చేశార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ యాగం కోసం.. సుమారు 10 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులను దేవదాయ శాఖ ప‌రిధిలోని దేవాలయాలపై వేయడం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆర్జేసీ, ఉపకమిషనర్‌ కేడర్‌ దేవాలయాలు 5 వేల కరపత్రాలు, 2 వేల వాల్‌పోస్టర్లు, పది పెద్ద హోర్డింగ్‌లు, 50 ఫ్లెక్సీలు, 50 బ్యానర్లు ముద్రించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక సహాయ కమిషనర్‌, గ్రేడ్‌ 1, 2, 3 దేవాలయాలు 2 వేల కరపత్రాలు, 1000 వాల్‌పోస్టర్లు, ఐదు పెద్ద హోర్డింగ్‌లు, 20 ఫ్లెక్సీలు, 25 బ్యానర్లను ముద్రించాలని పేర్కొన్నారు.

అసలు జగన్ మ‌రోసారి సీఎం అవ్వాల‌నే ఉద్దేశంతో చేస్తున్న‌ యాగానికి దేవాలయాల నిధుల నుంచి ప్రచార సామగ్రిని ముద్రించడం ఏమిటని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ యాగానికి మొత్తం రూ.10 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు దేవదాయ శాఖ తెలిపింది. వివిధ దేవాలయాల నుంచి నిధులు మళ్లిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో దేవ‌దాయ శాఖ ప‌రిధిలోని ఒక్కో ఆలయంపై రూ.30 లక్షల భారం పడుతుందని ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అవుతారో లేదో తెలియ‌దు కానీ.. అంతో ఇంతో న‌డుస్తున్న ఆల‌యాలు మాత్రం ఈ దెబ్బ‌తో అప్పుల కుప్ప‌లుగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

This post was last modified on May 12, 2023 10:42 am

Share
Show comments
Published by
satya
Tags: Jagan Yagam

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago