గడిచిన పదిహేనేళ్లుగా హైదరాబాద్ డెవలప్ మొంట్ ను చూస్తే.. నగరం మొత్తం ఒక పక్కకు ఒరిగిపోతున్నట్లుగా అనిపించక మానదు. నగరం డెవలప్ అవుతున్నా.. ఎక్కువ మాత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా సాగుతున్నట్లుగా చెప్పాలి. ఐటీ కంపెనీల రాకతో పాటు.. పలు ప్రాజెక్టులు పైప్ లైన్ తో ఉండటంతో.. మిగిలిన మహానగరానికి పశ్చిమభాగం ఒక మణిపూసలా మారింది.
ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే.. నగరానికి ఇబ్బందే. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లుక్ ఈస్ట్ అంటూ.. ఉప్పల్ ప్రాంతం వైపునఐటీ ప్రాజెక్టులు వచ్చేలా ప్లాన్ చేయటం తెలిసిందే. అయితే.. ఆశించినంతగా ఐటీ కంపెనీలు రాలేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దాని ప్రకారం ఐటీ కారిడార్ ఉండే పశ్చిమ ప్రాంతం తప్పించి.. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఐటీ కంపెనీల్నినెలకొల్పితే భారీ ఎత్తున ప్రోత్సాహాకాలు ఇవ్వాలని భావిస్తోంది.
ఇందుకోసం కొత్త పాలసీని ఏర్పాటు చేయనుంది. ఉత్తరాన కొంపల్లి.. దాని పరిసర ప్రాంతాలు.. తూర్పున ఉప్పల్.. పోచారం.. దక్షిణాన శంషాబాద్.. ఆదిభట్ల.. కొల్లూరు.. ఉస్మాన్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సహాకాలు ఉంటాయని చెబుతోంది. దీంతో.. నగరం నలుమూలల ఐటీ పరిశ్రమలు వస్తే.. హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ గ్రిడ్ ఏర్పడటమే కాదు.. పశ్చిమ ప్రాంతంపైన భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలా అని.. ప్రభుత్వం చెప్పిన ప్రాంతాల్లో ఐటీ కంపెనీల్ని నెలకొల్పితే.. విద్యుత్ తో పాటు..అద్దె తదితర అంశాల్లో ప్రోత్సహాకాలు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు సాగితే.. రానున్న ఐదారేళ్లలో చాలానే మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.
ప్రభుత్వం చెప్పినట్లుగా కంపెనీలు ప్రోత్సాహాకాలు సొంతం చేసుకోవాలంటే.. ఐదేళ్లలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాజాగా తామిచ్చిన ఆఫర్ తో రానున్న ఐదేళ్లలో 100 ఎకరాల మేర పారిశ్రామికవాడలు.. ఐటీ పార్కులుగా మారే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు మాదాపూర్.. కొండాపూర్.. హైటెక్ సిటీ మాదిరి తయారవుతాయని చెప్పక తప్పదు.
This post was last modified on August 6, 2020 11:19 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…