Political News

ప‌వ‌న్ మౌనం వెనుక అర్థ‌మేంటి? పొలిటిక‌ల్ హీట్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డ అకాల వ‌ర్షంతో దెబ్బ‌తిన్న పంట‌ల‌కు సంబంధించి రైతుల‌ను ఆయన క‌లుసుకున్నారు. వారితో ముచ్చ‌టించారు. వారి బాధ‌లు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప‌వ‌న్‌.. ఆ షూటింగును సైతం ప‌క్క‌న పెట్టి.. ఏపీలో ప‌ర్య‌టించారు. అది కూడా అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న రైతుల‌ను ప‌రామ‌ర్శించారు.

పవన్‌.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చి న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ అడిగి తెలుసుకు న్నా రు. ఇక‌, ప‌వ‌న్ కోసం.. మీడియా ప‌డిగాపులు ప‌డింది. ఆయ‌న వ‌చ్చిన మొద‌లు.. వెళ్లే వ‌ర‌కు కూడా గంట‌ల కొద్దీ మీడియా ఆయ‌న‌కోసం వేచి చూసింది. అయితే.. అనూహ్యంగా ప‌వ‌న్ మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోవ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది.

నిజానికి ఎక్క‌డ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ప‌వ‌న్ ఏపీ స‌ర్కారు పై నిప్పులు చెరుగుతున్నారు. అదే స‌మయంలో ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను కూడా ఆయ‌న ఎండ‌గ‌డుతున్నారు. అలాంటిది ఇప్పుడు రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చి.. వారి క‌ష్టాలు కూడా తెలుసుకుని మ‌రీ.. ఆయ‌న ప‌త్తాలేకుండా వెళ్లిపోయారు. క‌నీసం.. ప‌న్నెత్తు మాట కూడా స‌ర్కారుపై ఆయ‌న అన‌లేదు. దీంతో అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

దీనికి కార‌ణాలు ఏంటి? అనే విష‌యంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు తెర‌ మీదికి వ‌చ్చాయి. ఎప్పుడు మీడియా ముందు కు వ‌చ్చినా..రాకున్నా..చిన్న కార‌ణం దొరికితే.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగే ప‌వ‌న్‌.. ఇప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారేది ప్ర‌శ్న‌. ఇటీవ‌ల చంద్ర‌బాబుకూడా ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఆయన ఏకంగా.. స‌ర్కారుకు 72 గంట‌ల అల్టిమేటం ఇచ్చారు. అప్ప‌టిలోగా రైతుల‌కు న్యాయం చేయాల‌ని చెప్పారు. కానీ, ప‌వ‌న్ మాత్రం ఒక్క‌ కామెంట్ చేయ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

This post was last modified on May 11, 2023 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago