జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఇక్కడ అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులను ఆయన కలుసుకున్నారు. వారితో ముచ్చటించారు. వారి బాధలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్.. ఆ షూటింగును సైతం పక్కన పెట్టి.. ఏపీలో పర్యటించారు. అది కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించారు.
పవన్.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చి న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్ అడిగి తెలుసుకు న్నా రు. ఇక, పవన్ కోసం.. మీడియా పడిగాపులు పడింది. ఆయన వచ్చిన మొదలు.. వెళ్లే వరకు కూడా గంటల కొద్దీ మీడియా ఆయనకోసం వేచి చూసింది. అయితే.. అనూహ్యంగా పవన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం ఆశ్చర్యంగా మారింది.
నిజానికి ఎక్కడ కార్యక్రమం జరిగినా.. పవన్ ఏపీ సర్కారు పై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కూడా ఆయన ఎండగడుతున్నారు. అలాంటిది ఇప్పుడు రైతులను పరామర్శించేందుకు వచ్చి.. వారి కష్టాలు కూడా తెలుసుకుని మరీ.. ఆయన పత్తాలేకుండా వెళ్లిపోయారు. కనీసం.. పన్నెత్తు మాట కూడా సర్కారుపై ఆయన అనలేదు. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు.
దీనికి కారణాలు ఏంటి? అనే విషయంపై చర్చోపచర్చలు తెర మీదికి వచ్చాయి. ఎప్పుడు మీడియా ముందు కు వచ్చినా..రాకున్నా..చిన్న కారణం దొరికితే.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగే పవన్.. ఇప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారేది ప్రశ్న. ఇటీవల చంద్రబాబుకూడా ఇక్కడ పర్యటించారు. ఆయన ఏకంగా.. సర్కారుకు 72 గంటల అల్టిమేటం ఇచ్చారు. అప్పటిలోగా రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. కానీ, పవన్ మాత్రం ఒక్క కామెంట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
This post was last modified on May 11, 2023 12:59 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…