గత రెండు నెలలుగా ఊరూ వాడా హోరెత్తిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పోటెత్తి ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్లో 70 శాతం ఓట్లు పోలయ్యాయి. గత 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇది దాదాపు 8 శాతం ఎక్కువగా ఉంది. దీనిని బట్టి.. ఈ సారి ప్రజల్లో చైతన్యం కొంత మేరకు కనిపించింది.
అయితే.. ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం.. ప్రజల్లో ఏపార్టీపైనా పూర్తి విశ్వాసం కనిపించడం లేదనే! నిజానికి మోడీ నుంచి సోనియాగాంధీ వరకు హేమా హేమీలు ఇక్కడ ప్రచారం చేశారు. పెద్ద పెద్ద నాయకులు.. పెద్ద పెద్ద విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఉగ్రవాదం.. నుంచి హనుమాన్ వరకు.. ఉచితాల నుంచి రాష్ట్ర సెంటిమెంటు వరకు అనేక అంశాలు రాజకీయంగా.. ఊపేశాయి.
అయినా కూడా.. ప్రజల నుంచి మిశ్రమ స్పందనే కనిపించింది. ప్రజలు చాలా నేర్పుగా.. తమ సత్తా చూపించారనే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వెల్లడైన.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే.. బీజేపికి కానీ.. కాంగ్రెస్కు కానీ.. గుండుగుత్తగా.. ప్రజలు మెజారిటీని కట్టబెట్టలేదు. అంతేకాదు.. ఏపార్టీకి కూడా.. పూర్తిగా అధికారం అప్పగించలేదు. అంటే.. ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా.. పూర్తిగా దక్కించుకోలేక పోయిందని అనేకన్నా.. పార్టీలకు.. ప్రజలే.. తగిన విధంగా సమాధానం చెప్పారా? అని మేధావులు అంటున్నారు.
నిజానికి ఇప్పుడు కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నది.. బీజేపీ చెబుతున్న భజరంగ బలిని కానీ, కాంగ్రెస్ చెబుతున్న నిషేధాలు కానీ కాదు. సాగు తాగునీటికి అల్లాడుతున్న అనేక జిల్లాల్లో ప్రజలు ఉపాధి కోల్పోయారు. అక్కడ భారీ ఎత్తున అధికార పార్టీకి ఇప్పుడు గండి పడిందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీనిని బట్టి.. ప్రజలు కోరుకుంటున్నది.. సరైన పాలనే తప్ప.. పార్టీల మేనిఫెస్టోను కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా చూసుకున్నా.. కర్ణాటక ప్రజలు ఏపార్టీ కి మొగ్గు చూపకుండా.. మళ్లీ హంగ్ వైపు మొగ్గడం.. సర్వత్రా చర్చకు దారితీసింది.
This post was last modified on May 11, 2023 11:42 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…