Political News

జగన్ టీమ్ లో వైఎస్ అనుచరుడు…

వైఎస్ అనుచరులను జగన్ దూరం పెట్టాడంటారు. అందుకే కేవీపీ రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు వైసీపీలో కనిపించరంటారు. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ కు అత్యంత సన్నిహితులను కూడా జగన్ చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో నియోజకవర్గాల్లో విజయావకాశాలను పెంచే వారిని జగన్ రెడ్డి అక్కున చేర్చుకుంటున్నారు..

వైవీ రెడ్డి ఎంట్రీ…

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి యెర్రం వెంకటేశ్వర రెడ్డి (వైవీ రెడ్డి) రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో ఆయన ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజకీయాల్లో పెద్ద కాకపోయినా, నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎమ్మెల్యే టికెట్ పొందుతూ వచ్చారు. ఎమ్మెల్యేగా కూడా ఆయన లో ప్రొఫెల్ లోనే ఉండేవారు. ఎవరితో పెద్దగా కలిసేవారు కాదు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత వెంకటేశ్వర రెడ్డి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. దాని వెనుక ఒక పెద్ద రహస్యముందని చెబుతారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు… ఆయన్ను జనసేనలో చేర్పించారని అనేవారు. ఎన్నికల్లో పోటీకి కొంత ఫండింగ్ కూడా చేశారని చెబుతారు. ఆ ఎన్నికల్లో వెంకటేశ్వర రెడ్డికి పట్టుమని పది వేల ఓట్లు కూడా రాలేదు. కోడెల కూడా ఓడిపోయారు. వైసీపీ తరపున విజయం సాధించిన అంబటి రాంబాబు ఇప్పుడు నీటి పారుదల శాఖామంత్రిగా ఉన్నారు…

వైసీపీలో చేరిక..

యెర్రం వెంకటేశ్వరరెడ్డి అకస్మాత్తుగా మళ్లీ రాజకీయ తెరమీదకు వచ్చారు. తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాంబాబు, నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు ఆయన వెంట ఉన్నారు.

కన్నాకు చెక్ పెట్టేందుకేనా..

తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అంబటికి విశ్రాంతి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. దానితో కాపు రెడ్డి కాంబినేషన్ గా ఉండేందుకు వెంకటేశ్వరరెడ్డిని రంగంలోకి తెచ్చారని చెబుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి లేదా ఆయన కుమారుడు నితిన్ రెడ్డినిపోటీ చేయించిన పక్షంలో మీరు కూడా పూర్తిగా సహకరించాలని అంబటిని అందరి ముందు జగన్ ఆదేశించారట. అప్పుడు రెడ్డి ఓట్లు, కాపు ఓట్లు కలిసి వైసీపీకే వస్తాయని విశ్వసిస్తున్నారట. అప్పుడు కన్నాను ఓడించే వీలుంటుందని లెక్కలేసుకుంటున్నారట. చూడాలి మరి..

This post was last modified on May 11, 2023 11:32 am

Share
Show comments
Published by
satya
Tags: YV Reddy

Recent Posts

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

3 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

5 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

5 hours ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

5 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

6 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

7 hours ago