కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది.
ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి కొందరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు(వీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా కప్పాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
దీనికితోడు వివేకా హత్య నుంచి తమకు అనుకూల ఓటు బ్యాంకు వస్తుందని.. తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నికల సమయంలో ఉన్న లెక్కలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా ఇక్కడి పరిస్తితి ఉంది. ఇదేసమయంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో కీలక వ్యక్తులు తటస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రజల నుంచి రాజకీయంగా ఎదురవుతున్న కొన్ని పరిణామాల నుంచి కూడా వారు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో కడపలో ఈ సారి తమ పట్టు కోల్పోకుండా.. జాగ్రత్తలు తీసుకునే పనినివైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
This post was last modified on July 7, 2023 6:32 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…