Political News

క‌డ‌ప‌లో ఈ సారి మామూలుగా ఉండ‌దా..!

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం త‌పిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాల‌ని శ‌త విధాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే.. వారికి ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలోనే చ‌ర్చ‌సాగుతోంది.

ఈ చ‌ర్చ‌లు కొలిక్కి వ‌స్తే..డీఎల్ ర‌వీంద్రారెడ్డి వంటి కొంద‌రు కీల‌క నేత‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది ఖ‌చ్చితంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ప్ర‌భావం చూపిస్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. అదే స‌మయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు(వీరు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆస‌క్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా క‌ప్పాల‌నేది టీడీపీ వ్యూహంగా ఉంది.

దీనికితోడు వివేకా హ‌త్య నుంచి త‌మ‌కు అనుకూల ఓటు బ్యాంకు వ‌స్తుంద‌ని.. తెలుగు త‌మ్ముళ్లు లెక్క‌లు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న లెక్క‌లు వేరు.. ఇప్పుడు వేరు అన్న‌ట్టుగా ఇక్కడి ప‌రిస్తితి ఉంది. ఇదేస‌మ‌యంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జ‌ర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వ‌చ్చిన ఆటుపోట్ల‌తో కీల‌క వ్య‌క్తులు త‌టస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది.

ఇది ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయంగా ఎదుర‌వుతున్న కొన్ని ప‌రిణామాల నుంచి కూడా వారు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. దీంతో క‌డ‌ప‌లో ఈ సారి త‌మ ప‌ట్టు కోల్పోకుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకునే ప‌నినివైసీపీ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on July 7, 2023 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago