కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది.
ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి కొందరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు(వీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా కప్పాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
దీనికితోడు వివేకా హత్య నుంచి తమకు అనుకూల ఓటు బ్యాంకు వస్తుందని.. తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నికల సమయంలో ఉన్న లెక్కలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా ఇక్కడి పరిస్తితి ఉంది. ఇదేసమయంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో కీలక వ్యక్తులు తటస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రజల నుంచి రాజకీయంగా ఎదురవుతున్న కొన్ని పరిణామాల నుంచి కూడా వారు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో కడపలో ఈ సారి తమ పట్టు కోల్పోకుండా.. జాగ్రత్తలు తీసుకునే పనినివైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
This post was last modified on July 7, 2023 6:32 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…