కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది.
ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి కొందరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు(వీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా కప్పాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
దీనికితోడు వివేకా హత్య నుంచి తమకు అనుకూల ఓటు బ్యాంకు వస్తుందని.. తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నికల సమయంలో ఉన్న లెక్కలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా ఇక్కడి పరిస్తితి ఉంది. ఇదేసమయంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో కీలక వ్యక్తులు తటస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రజల నుంచి రాజకీయంగా ఎదురవుతున్న కొన్ని పరిణామాల నుంచి కూడా వారు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో కడపలో ఈ సారి తమ పట్టు కోల్పోకుండా.. జాగ్రత్తలు తీసుకునే పనినివైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
This post was last modified on July 7, 2023 6:32 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…