కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది.
ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి కొందరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రభావం చూపిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు(వీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు) కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వారిని కూడా పార్టీలోకి తీసుకుని.. కండువా కప్పాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది.
దీనికితోడు వివేకా హత్య నుంచి తమకు అనుకూల ఓటు బ్యాంకు వస్తుందని.. తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. 2019 ఎన్నికల సమయంలో ఉన్న లెక్కలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా ఇక్కడి పరిస్తితి ఉంది. ఇదేసమయంలో వైసీపీ కూడా ఈ జిల్లాపై చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో కీలక వ్యక్తులు తటస్థంగా ఉన్నారు. వైసీపీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రజల నుంచి రాజకీయంగా ఎదురవుతున్న కొన్ని పరిణామాల నుంచి కూడా వారు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో కడపలో ఈ సారి తమ పట్టు కోల్పోకుండా.. జాగ్రత్తలు తీసుకునే పనినివైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
This post was last modified on July 7, 2023 6:32 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…