Political News

హ్యాట్రిక్ ప్లాపులు దాటేదెలా… టీడీపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం ద‌క్కించుకుని గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్న‌ టీడీపీకి హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు అంత‌ర్మ‌థ‌నంలో ముంచేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైనాట్ పులివెందుల అని నిన‌దించిన పార్టీలో దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌రుస ప‌రాజ‌యాలు వెక్కిరిస్తున్నాయి. వీటిలో కీల‌క‌మై న చిత్తూరు జిల్లా కూడా ఉండ‌డం.. ఇది పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టాల‌ని యోచిస్తున్నారు.

గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప‌రాజ‌యం పాల‌వుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు కూడా ప‌రిస్థితి అలానే ఉంది. వీటిలో రాజాం, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, రంపచోడవరం, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్త­పేట, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

అదేవిధంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, నెల్లూరులోని ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, క‌డ‌ప‌లోని బద్వేలు, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలా­పురం, జమ్మలమడుగు, మైదుకూరు, క‌ర్నూలులోని నందికొట్కూరు, కోడు­మూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, ఆలూరు, చిత్తూరులోని జి.డి.­నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి సెగ పెడుతున్నాయి.

2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత‌.. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం అచ్చెన్నాయుడు చెబుతున్న‌ట్టు 160 స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వీటిలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ దృష్టి పెట్ట‌లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago