ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వర్గాల వారీగా ఓటు బ్యాంకు చీలుతున్న పరిస్థితి కనిపి స్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. బెంగళూరు, మైసూరు, హుబ్బళి వంటి ఐటీ, పారిశ్రామిక నగరాల్లో ఓటు విభజన తెరమీదికి వచ్చింది. పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్నా.. వ్యాపార, ఐటీ వర్గాలు.. మొత్తంగా బీజేపీకి జై కొడుతున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత ఉన్న అంబానీ వంటివారు.. తమ కనుసన్నల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నారు.
పైకి ప్రధాన వ్యాపార వేత్తలు ఎవరూ కూడా తెరమీదికి కనిపించడం లేదు. కానీ, లోపాయికారీగా జరగాల్సిన రాజకీయాలు కర్ణాటకలో జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో మంచి పలుకుబడి.. తెల్లారి లేస్తే.. పారిశ్రామిక వర్గాలతో వ్యాపార సంబంధాలు ఉన్న వారిలో ముఖేష్ అంబానీ.. అదానీ వంటివారిని కొట్టిపారేయలేం. వారికి .. కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. కర్ణాటకలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అన్నీ కూడా.. లోపాయికారీగా బీజేపీకి సపోర్టు చేయడం ఖాయమని చెబుతున్నాయి. ఈ ఓటు బ్యాంకు కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. ఐటీ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు.. వారి కుటుంబాలపైనా.. పారిశ్రామికంగా చూసినా.. లక్షల సంఖ్యలో ఓట్లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోందని కర్ణాటక వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలోనూ ఇదే తరహా రాజకీయం తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే జరిగితే.. ఇప్పుడు న్న అంచనాల ప్రకారం.. బీజేపీ మాటనే ఆయా వర్గాలు వింటాయి. ఏపీలో ముఖేష్ అంబానీ అయినా.. అదానీ అయినా.. జగన్కు అనుకూలంగా ఉన్నారు. అదేసమయంలో కేంద్రంలోనూ.. బీజేపీకి సానుకూలంగా ఉన్నారు. భారీ ఎత్తున లబ్ధి కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ వర్గాలు.. ఐటీ, పారిశ్రామికంగా జగన్కు దన్నుగా నిలిచే అవకాశం ఉంటుందని.. చెబుతున్నారు. అయితే.. ఇక్కడ ప్రత్యక్షంగా ఐటీ, పారిశ్రామిక వర్గాలను ప్రభావితం చేయకపోయినా.. పరోక్షంగా గెలిపించే అవకాశం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 12, 2023 7:29 am
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…