ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వర్గాల వారీగా ఓటు బ్యాంకు చీలుతున్న పరిస్థితి కనిపి స్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. బెంగళూరు, మైసూరు, హుబ్బళి వంటి ఐటీ, పారిశ్రామిక నగరాల్లో ఓటు విభజన తెరమీదికి వచ్చింది. పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్నా.. వ్యాపార, ఐటీ వర్గాలు.. మొత్తంగా బీజేపీకి జై కొడుతున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత ఉన్న అంబానీ వంటివారు.. తమ కనుసన్నల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నారు.
పైకి ప్రధాన వ్యాపార వేత్తలు ఎవరూ కూడా తెరమీదికి కనిపించడం లేదు. కానీ, లోపాయికారీగా జరగాల్సిన రాజకీయాలు కర్ణాటకలో జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో మంచి పలుకుబడి.. తెల్లారి లేస్తే.. పారిశ్రామిక వర్గాలతో వ్యాపార సంబంధాలు ఉన్న వారిలో ముఖేష్ అంబానీ.. అదానీ వంటివారిని కొట్టిపారేయలేం. వారికి .. కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. కర్ణాటకలో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అన్నీ కూడా.. లోపాయికారీగా బీజేపీకి సపోర్టు చేయడం ఖాయమని చెబుతున్నాయి. ఈ ఓటు బ్యాంకు కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. ఐటీ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు.. వారి కుటుంబాలపైనా.. పారిశ్రామికంగా చూసినా.. లక్షల సంఖ్యలో ఓట్లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోందని కర్ణాటక వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలోనూ ఇదే తరహా రాజకీయం తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే జరిగితే.. ఇప్పుడు న్న అంచనాల ప్రకారం.. బీజేపీ మాటనే ఆయా వర్గాలు వింటాయి. ఏపీలో ముఖేష్ అంబానీ అయినా.. అదానీ అయినా.. జగన్కు అనుకూలంగా ఉన్నారు. అదేసమయంలో కేంద్రంలోనూ.. బీజేపీకి సానుకూలంగా ఉన్నారు. భారీ ఎత్తున లబ్ధి కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ వర్గాలు.. ఐటీ, పారిశ్రామికంగా జగన్కు దన్నుగా నిలిచే అవకాశం ఉంటుందని.. చెబుతున్నారు. అయితే.. ఇక్కడ ప్రత్యక్షంగా ఐటీ, పారిశ్రామిక వర్గాలను ప్రభావితం చేయకపోయినా.. పరోక్షంగా గెలిపించే అవకాశం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 12, 2023 7:29 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…