పెట్రోల్పై పావలా తగ్గించేందుకు మనసు ఒప్పని ప్రభుత్వాలు.. పేదలకు పట్టెడు కూడు పెట్టండి.. కరోనా తో అతలా కుతలం అవుతున్నారని అంటే.. లెక్కులు వేసుకున్న సర్కార్లు.. ఇప్పుడు.. ఉదారంగా ముందు కు వచ్చాయి. ఏదోప్రజాసేవ చేసేందుకో.. దేశాభివృద్ది కోసమో కాదు.. ఒక సినిమానుప్రజలతో చూపించేందు కు! ఆ సినిమాను ప్రజల మైండ్లోకి ఎక్కించేందుకు ఏకంగా కోట్లకు కోట్ల సొమ్మును ఉదారంగా వదిలేసుకు న్నాయి. అవికూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం.
మత మార్పిళ్లు, ఉగ్రవాదం అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందించిన ది కేరళ స్టోరీ
సినిమా విషయంలో ఆది నుంచి బీజేపీ సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోడీ కూడా కర్ణాటక ఎన్నికల్లో సినిమా ప్రస్తావన తెచ్చారు. ఇక, ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకలు వినోద పన్ను మినహాయింపును ప్రకటించాయి.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా.. ఈ పన్ను ఉంది. అయినప్పటికీ.. ఒక్కొక్క రాష్ట్రం సుమారు 20 నుంచి 40 కోట్ల వరకు పన్నును వదులు కోవడం గమనార్హం. అయినా.. ఫర్వాలేదు.. కానీ ఈ సినిమాను అందరికీ చూపిస్తామని చెప్పడం గమనార్హం. పన్ను తగ్గడం వల్ల.. ఏం జరుగుతుందంటే.. సినిమా టికెట్ల ధరలు తగ్గుతాయి. ఒక్కొక్కొ టికెట్పై ఎంత లేదన్నా.. 5 నుంచి 10 రూపాయలు తగ్గుతుందని.. అంచనా. దీంతో ఎక్కువ మంది ఈ సినిమా చూసే(చూపించే) అవకాశం ఉంటుంది.
ఇక, ఇప్పటికే బీజేపీ కీలక నేతలు అందరూ కేరళ స్టోరీని వీక్షించారు. ఇదిలావుంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయంపై.. నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఆ చేత్తోనే.. పెట్రోల్ సెస్సులు తగ్గించండి. ఆ చేత్తోనే.. పన్నులు తగ్గించండి.. అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. కొందరు .. ఇది బీజేపీ కేరళ స్టోరీ.. బ్రో! అంటూ.. పెదవి విరుస్తున్నారు.
కేసీఆర్ ఏం చేస్తారు?
ఇదిలావుంటే.. బీజేపీని వ్యతిరేకించే రాష్ట్రాల్లో కేరళ స్టోరీని ప్రభుత్వాలునిషేధించాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్లలో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశా రు. ఇక, మోడీ అంటే.. ఒంటికాలిపై లేచే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. మరి ఆయన కూడా ఈ సినిమాను నిషేధిస్తారా? లేక.. సినిమాను సినిమాగానే చూస్తారా? అనేది వేచి చూడాలి.
This post was last modified on May 10, 2023 11:04 am
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…