ఏపీలో రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు.. సర్వత్రా వినిపిస్తున్న మాట. ఎవరిని కదిపి నా.. ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించే ఉద్దేశం లేకుండా.. తన దారిలో తను వ్యవహరిస్తోంది. ఇప్పటికి నాలుగేళ్లు అయిపోయినా.. అమరావతిఊసు లేదు. కనీసం.. ఇక్కడి రైతుల ఉద్యమానికి కూడా వైసీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక, దీంతో ‘చంద్రబాబు వస్తే..’ రాజధాని బాగుపడుతుందని అనుకునే వారు పెరుగుతున్నారు.
ఇది సహజమే. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఏదో చేయాలని తపిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇదే.. ఇప్పుడు వైసీపీకి ప్రాణసంకటంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజన్ను అజెండాగా పెట్టుకుని… అమరావతిని అభివృద్ధి చేస్తే.. అది తమకు ఎన్నికల్లో పెద్ద ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ట్టు వైసీపీపై టీడీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రాజధానిని ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా.. అంటే..ఎలాంటి అభివృద్ధి లేకపోయినా.. ఉన్నది ఉన్నట్టు ఉంటే.. రేపు చంద్రబాబు వస్తే.. డెవలప్ చేస్తారు.
కానీ, ఈ అవకాశం కూడా లేకుండా.. మొత్తానికి కూకటి వేళ్లతో సహా అమరావతిని పెకలించి వేసే ఉద్దేశం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కొటిగా ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని భావిస్తోందని చెబుతున్నారు. తాజాగా ఆర్5 జోన్లో పేదలకు 1200 ఎకరాల భూమిని జగనన్న ఇళ్లకు కేటాయించేసింది. ఇది చాలదని గుంటూరు జిల్లా కలెక్టర్ ఇండెంట్ పెట్టడంతో ఆర్3 జోన్(ఇది రాజధానికి అత్యంత కీలకం) లో మరో 300 ఎకరాలను గుర్తించి రాత్రికి రాత్రికి ఇచ్చేశారు.
రెండు జిల్లాల కలెక్టర్లు అడిగిన భూమికి అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ లేఖ రాశారు. గతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదలకు 1134.58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు జిల్లాలలో లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా… ఎస్3 జోన్లో అదనంగా 268 ఎకరాలు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా అమరావతి రూపు రేఖలు సర్వనాశనం అయిపోతున్నాయనేది టీడీపీ వాదన. అంటే..రేపు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా.. దీనిని సరిచేసి.. తిరిగి అమరావతిని గాడలో పెట్టే అవకాశం లేకుండా.. చేస్తున్నారనేది టీడీపీ నేతల వాదనగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 10, 2023 11:55 pm
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…
జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…