తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా ఈ నెలాఖరుకు జరగబోయే మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేయనున్నారు. ఇంతకుముందు జరిగిన మహానాడులో కూడా ఇలాంటి తీర్మానాలే చేశారు.. కానీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాటలు చెప్పడమే కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపలేదంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి కూడా గతంలో ఇలాంటి ఆరోపణే చేశారు.
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో నిర్వహించిన మహానాడులోనూ ఈ తీర్మానం చేసినా.. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని ఆమె అప్పట్లో ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని…. ఆయన ప్రధానితో భేటీ అయిన సందర్భంలోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న కోరికను వెలిబుచ్చారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి.
మరోవైపు.. దీనిపై ఇంకో విమర్శా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదనే వారు కూడా ఉన్నారు. అందుకు కారణం కూడా చెప్తుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారత రత్న వస్తే దాన్ని ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తప్ప ఇంకెవరూ ఆ అవార్డు స్వీకరించే అవకాశమే లేదు. అది ఇష్టం లేకే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని.. చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం వల్లే అవార్డు రాలేదని టీడీపీ నేతల నుంచీ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.
This post was last modified on May 10, 2023 6:26 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…