తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా ఈ నెలాఖరుకు జరగబోయే మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేయనున్నారు. ఇంతకుముందు జరిగిన మహానాడులో కూడా ఇలాంటి తీర్మానాలే చేశారు.. కానీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాటలు చెప్పడమే కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపలేదంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి కూడా గతంలో ఇలాంటి ఆరోపణే చేశారు.
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో నిర్వహించిన మహానాడులోనూ ఈ తీర్మానం చేసినా.. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని ఆమె అప్పట్లో ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని…. ఆయన ప్రధానితో భేటీ అయిన సందర్భంలోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న కోరికను వెలిబుచ్చారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి.
మరోవైపు.. దీనిపై ఇంకో విమర్శా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదనే వారు కూడా ఉన్నారు. అందుకు కారణం కూడా చెప్తుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారత రత్న వస్తే దాన్ని ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తప్ప ఇంకెవరూ ఆ అవార్డు స్వీకరించే అవకాశమే లేదు. అది ఇష్టం లేకే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని.. చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం వల్లే అవార్డు రాలేదని టీడీపీ నేతల నుంచీ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.
This post was last modified on May 10, 2023 6:26 am
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…