తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా ఈ నెలాఖరుకు జరగబోయే మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేయనున్నారు. ఇంతకుముందు జరిగిన మహానాడులో కూడా ఇలాంటి తీర్మానాలే చేశారు.. కానీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాటలు చెప్పడమే కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపలేదంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి కూడా గతంలో ఇలాంటి ఆరోపణే చేశారు.
చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో నిర్వహించిన మహానాడులోనూ ఈ తీర్మానం చేసినా.. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని ఆమె అప్పట్లో ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని…. ఆయన ప్రధానితో భేటీ అయిన సందర్భంలోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న కోరికను వెలిబుచ్చారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి.
మరోవైపు.. దీనిపై ఇంకో విమర్శా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదనే వారు కూడా ఉన్నారు. అందుకు కారణం కూడా చెప్తుంటారు. ఒకవేళ ఎన్టీఆర్ కు భారత రత్న వస్తే దాన్ని ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తప్ప ఇంకెవరూ ఆ అవార్డు స్వీకరించే అవకాశమే లేదు. అది ఇష్టం లేకే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో ఏమాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని.. చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం వల్లే అవార్డు రాలేదని టీడీపీ నేతల నుంచీ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.
This post was last modified on May 10, 2023 6:26 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…