ఒక అంశం మీద పోరాడుతున్నప్పుడు ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలంటే.. వ్యూహం పక్కాగా ఉండాలి. మాటలు గంభీరంగా ఉండి.. చేతలు చులకన చేసేలా ఉంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. తాజాగా ఏపీ విపక్ష నేత కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఇదే రీతిలో ఉంది. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల అంశంపై ఏపీ సర్కారు దూకుడుగా దూసుకెళుతున్న వైనం తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చి తాత్కాలిక స్పీడ్ బ్రేకులు వేసింది.
మూడు రాజధానుల నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. జగన్ సర్కారు మీద నిప్పులు చెరగటం.. 48 గంటలు టైమివ్వటం తెలిసిందే. ఈ మాటలు చెప్పి 24 గంటలు గడవక ముందే..మరోసారి మీడియా భేటీ ఏర్పాటు చేసిన ఆయన.. కొత్త పాటను ఎత్తుకున్నారు. అమరావతి అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని వీడియోల రూపంలో ప్రదర్శించిన ఆయన మాట తప్పినట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం జరుగుతోందన్న మాట బాబు నోటి నుంచి రావటం గమనార్హం. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలన్న ఆయన.. రాజధానికి 30వేల ఎకరాలు కావాలని జగన్ అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. తాను చెప్పిన విషయాల్ని మరిచి మూడుముక్కలాటను మొదలు పెట్టారన్నారు. వారి చేతికి అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికలకు ముందే చెప్పారన్నారు. వేలాది మంది అమరావతి కోసం రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారని చెప్పారు.
మూడు రాజధానుల మీద జగన్ సర్కారు తీరుపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామాలు చేస్తారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తానంత దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేనన్న విషయాన్ని ఆయన తన తాజా వ్యాఖ్యలతో మరోసారి నిరూపించారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని.. ప్రజల్ని మోసం చేయటం తప్పు అంటూ హితవు పలికారు.
ఏపీ ఏకైక రాజధాని అమరావతిగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తే.. తాము తమ పదవుల్ని వదిలేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం. రాజకీయాల్లో నమ్మిన దాని కోసం దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. తడవకోసారి మాటలు చెప్పకూడదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి తెలుసుకుంటారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. ఆయన తన రాజీనామాను ప్రకటిస్తారని భావించారు. అందుకు భిన్నంగా ఆయన మాటలు యూటర్న్ తీసుకున్నట్లుగా ఉండటం గమనార్హం.
This post was last modified on August 5, 2020 11:14 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…