హైదరాబాద్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. వాళ్లు భారీ దాడికి ప్లాన్ చేసే లోపే భద్రతా దళాలు అలెర్ట్ కావడంతో సామూహిక జనహననాన్ని నివారించగలిగారు.
తెలంగాణ రాజధానిలో మారణహోమం సృష్టించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారు. ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఆ సంగతి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఉమ్మడి దాడుల్లో మొత్తం 16 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అందులో 11 మంది మధ్యప్రదేశ్ వారు. హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది..
భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సాహిత్యం కూడా స్వాధీనమైందని చెబుతున్నారు. అసలు వారి ప్రధాన లక్ష్యం ఎవరు, వారి ప్లాన్ ఏమిటి తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని భద్రతా దళాలు అంటున్నాయి.
ఉగ్రవాదులందరినీ అరెస్టు చేశామని చెప్పలేని పరిస్థితుల్లో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. రోడ్లపైన అనుమానిత వస్తువులు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు..
This post was last modified on May 9, 2023 12:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…