ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి వైసీపీ నాయకుల నోటి దురుసును అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతలనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా ఎవరైనా తమకు ఎదురు మాట్లాడితే బూతులు తిట్టేయడం, కొట్టడానికి కూడా వెనుకాడకపోవడం పలు సందర్భాల్లో చూశాం.
తాజాగా పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఒక రైతును దుర్భాషలాడిన తీరు వివాదాస్పదమైంది. అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయిందంటూ సదరు రైతు గోడు వెళ్లబోసుకుంటే.. ఆయన బూతులు అందుకున్నారు.
ధాన్యం తడిసిపోతే నేనేం చేస్తా అంటూ ఆ రైతును ఎర్రిపప్పా అన్నారు. ఈ వ్యాఖ్యలపై తర్వాత మీడియా వాళ్లు వివరణ అడిగితే.. అతను రైతు కాదు, తాగుబోతు.. నేనేమీ తప్పు మాట్లాడలేదు అని కవర్ చేసుకున్నారు. ఐతే రైతును ఎర్రిపప్పా అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి.. నాగేశ్వరరావు తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఇది రైతులకు ప్రభుత్వం మీద చెడు సంకేతాలను ఇస్తుందన్న ఉద్దేశంతో ఆయన మరుసటి రోజు తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈసారి దూకుడు తగ్గించుకుని వినమ్రంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎర్రిపప్పా అనే పదానికి ఆయన కొత్త అర్థం చెప్పి మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఎర్రిపప్పా అంటే తిట్టేం కాదని.. బుజ్జి నాన్నా అన్న అర్థంతో వాడతామని ఆయనన్నారు. కానీ కవరింగ్లో ఆయన మరింతగా సోషల్ మీడియాకు దొరికిపోయారు. నాగేశ్వరరావుతో సహా వైసీపీ నేతలందరూ ఎర్రిపప్పలు, అంటే బుజ్జి కన్నాలే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. హుందాగా తప్పయిందని ఒప్పేసుకుని, క్షమాపణ చెప్పాల్సింది పోయి కవరింగ్తో ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు మంత్రిగారు.
This post was last modified on May 9, 2023 6:29 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…