ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 పైచిలుకు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ అప్పాయింట్మెంట్ కోసం వేచి ఉన్నారా? వీరిలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల కు సంబందించి వీరంతా తమ గోడును వెళ్లబోసుకునేందుకు..జగన్ దర్శనం కోసం తపిస్తున్నారనేది తాడేపల్లి వర్గాలు చెబుతున్న మాట. దాదాపు 100 మందికి పైగా..ధైర్యంగా ఉన్నారు. తమ చరిష్మా పేరు వంటివి తమను కాపాడతాయని వారు విశ్వసిస్తున్నారు.
అయితే..గత ఎన్నికల్లో కొత్తగా గెలిచిన వారు.. జగన్ పాదయాత్ర ఎఫెక్ట్తో 1000 నుంచి 1500 లోపు మెజారిటీ దక్కించుకున్నవారు.. మాత్రం ప్రాణాలు చిక్కపట్టుకుని ఉన్నారు. వీరంతా కూడా గెలుపు పై దాదాపు ఆశలు వదిలేసుకున్నట్టుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు వైసీపీ అధినేత దర్శనం కోసం పడిగాపులు పడుతున్నట్టు సమాచారం. విజయవాడలోని కొన్ని హోటళ్లు ఫుల్ అయిపోయాయి.
వరుస నాలుగు రోజుల నుంచి పలు హోటళ్ల ముందు నో రూమ్ బోర్డులు వేలాడుతున్నాయి. వీటిపై ఆరాతీసిన మీడియాకు.. అందరూ వైసీపీ నాయకులేనని తేలిందట. దీంతో మరికొంత లోతుగా వెళ్తే.. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి..జగన్ పిలుపు కోసం వారంతా వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో రెండు మూడు రోజులుగా బడ్జెట్ హోటళ్లన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు తాడేపల్లి నుంచి ఎలాంటి కబురు అందలేదని సమాచారం.
ఇదిలావుంటే.. అసలు వీరి సమస్య ఏంటి? ఇప్పటికిప్పుడు జగన్ను కలిసి ఏం చేయాలని అనుకుంటున్నారనే దానిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోరుకునేవారు కొందరు అయితే.. మరికొందరు..అంతర్గత కుమ్ములాటలతో వేడెక్కిపోయి.. అధినేత దగ్గరే తేల్చుకుందామని వచ్చినవారు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఉన్నారు. కొన్నాళ్లుగా ఈయనకు సెగ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ దగ్గర తేల్చుకునేందుకు సిద్ధపడ్డారట. మరి ఇప్పటి వరకు దీనిపై జగన్ దృష్టి పెట్టలేదు. మరిఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 8, 2023 7:04 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…