Political News

ఇద్దరు ఎమ్మెల్యేలు, రెండు మండలాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్‌వార్‌ మొదలయ్యింది.

శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పడరాని పాట్లు పడుతుండటం… నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటంటూ జొన్నలగడ్డ పద్మావతి మోకాలడ్డుతుండటమే కారణమంటూ జోరుగా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో చర్చసాగుతోందట. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి యల్లనూరు మండల పరిధిలోకి వస్తుంది. పక్క మండలం పుట్లూరు. ఈ రెండు మండలాల్లో ఆయనకు బలమైన అనుచరవర్గం వుంది. ఈ మండలాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అడ్డుతగులుతూ వ్యతిరేక వర్గాన్ని తన అనుచర వర్గంపైకి ఉసిగొల్సుతున్నారనే భావనలో పెద్దారెడ్డి వున్నారు. అసలు మన ప్రాంతంలో పెద్దారెడ్డి పెత్తనమేంటని పద్మావతి భర్త సాంబశివరావు ఆమెను రెచ్చగొడుతున్నారు.

పుండుమీద కారం చల్లినట్లుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి కొరకరాని కొయ్యలా తయారైన భోగాతి నారాయణరెడ్డికి శింగనమల ఎమ్మెల్యే రాజకీయంగా అండగా వుండటం కూడా మింగుడు పడటం లేదు. ఒకప్పుడు పుట్లూరు యల్లనూరు మండలాల్లో జేసీ వర్గాన్ని లీడ్ చేసిన భోగాతి నారాయణరెడ్గికి వైసీపీలోనూ పెద్దపీట వేస్తుండటంతో పెద్దారెడ్డి లోలోన మధనపడుతున్నారు. పైగా ఆయనకు భారీగా కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు. వైసీపీ అధికారంలో వున్నా తనకు అన్ని విధాలా అండదండగా వున్న పుట్లూరు , యల్లనూరు మండలాల్లోని అనుచరవర్గం ఇబ్బందులు పడుతుండటం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంపై సన్నిహితులతో కేతిరెడ్డి ఆవేదన చెందుతున్నారు.

పుట్లూరు మండలంలో పెద్దారెడ్డి కొనుగోలు చేసిన భూములను ఆన్ లైన్లోకి ఎక్కించకుండా ఎమ్మెల్యే పద్మావతి అడ్డుపడుతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్న మాట. ఇలాగైతే తాను అక్కడ ధర్నాలు చేయాల్సి వస్తుందని పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక యల్లనూరు మండలం దంతలపల్లిలో ఉపాధిహామీ పనుల విషయంలో పెద్దారెడ్డి , భోగాతి నారాయణరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్దారెడ్డి వర్గీయులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఒత్తిడితో భోగాతి నారాయణరెడ్డి వర్గీయులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట. ఈ కొట్లాట ఇంకెంత దూరం పోతుందోనని అనంతపురం వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు…

This post was last modified on May 12, 2023 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

16 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago