Political News

ఇద్దరు ఎమ్మెల్యేలు, రెండు మండలాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్‌వార్‌ మొదలయ్యింది.

శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పడరాని పాట్లు పడుతుండటం… నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటంటూ జొన్నలగడ్డ పద్మావతి మోకాలడ్డుతుండటమే కారణమంటూ జోరుగా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో చర్చసాగుతోందట. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి యల్లనూరు మండల పరిధిలోకి వస్తుంది. పక్క మండలం పుట్లూరు. ఈ రెండు మండలాల్లో ఆయనకు బలమైన అనుచరవర్గం వుంది. ఈ మండలాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అడ్డుతగులుతూ వ్యతిరేక వర్గాన్ని తన అనుచర వర్గంపైకి ఉసిగొల్సుతున్నారనే భావనలో పెద్దారెడ్డి వున్నారు. అసలు మన ప్రాంతంలో పెద్దారెడ్డి పెత్తనమేంటని పద్మావతి భర్త సాంబశివరావు ఆమెను రెచ్చగొడుతున్నారు.

పుండుమీద కారం చల్లినట్లుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి కొరకరాని కొయ్యలా తయారైన భోగాతి నారాయణరెడ్డికి శింగనమల ఎమ్మెల్యే రాజకీయంగా అండగా వుండటం కూడా మింగుడు పడటం లేదు. ఒకప్పుడు పుట్లూరు యల్లనూరు మండలాల్లో జేసీ వర్గాన్ని లీడ్ చేసిన భోగాతి నారాయణరెడ్గికి వైసీపీలోనూ పెద్దపీట వేస్తుండటంతో పెద్దారెడ్డి లోలోన మధనపడుతున్నారు. పైగా ఆయనకు భారీగా కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు. వైసీపీ అధికారంలో వున్నా తనకు అన్ని విధాలా అండదండగా వున్న పుట్లూరు , యల్లనూరు మండలాల్లోని అనుచరవర్గం ఇబ్బందులు పడుతుండటం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంపై సన్నిహితులతో కేతిరెడ్డి ఆవేదన చెందుతున్నారు.

పుట్లూరు మండలంలో పెద్దారెడ్డి కొనుగోలు చేసిన భూములను ఆన్ లైన్లోకి ఎక్కించకుండా ఎమ్మెల్యే పద్మావతి అడ్డుపడుతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్న మాట. ఇలాగైతే తాను అక్కడ ధర్నాలు చేయాల్సి వస్తుందని పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక యల్లనూరు మండలం దంతలపల్లిలో ఉపాధిహామీ పనుల విషయంలో పెద్దారెడ్డి , భోగాతి నారాయణరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్దారెడ్డి వర్గీయులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఒత్తిడితో భోగాతి నారాయణరెడ్డి వర్గీయులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట. ఈ కొట్లాట ఇంకెంత దూరం పోతుందోనని అనంతపురం వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు…

This post was last modified on May 12, 2023 2:36 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago