ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్తితి వచ్చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఎన్నికల వరకూ ఆ ఇద్దరు సఖ్యతగానే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఇక అప్పటి నుంచే కోల్డ్వార్ మొదలయ్యింది.
శింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు , యల్లనూరు మండలాల్లలో తనకున్న పట్టు నిలుపుకునేందుకోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పడరాని పాట్లు పడుతుండటం… నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటంటూ జొన్నలగడ్డ పద్మావతి మోకాలడ్డుతుండటమే కారణమంటూ జోరుగా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో చర్చసాగుతోందట. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి యల్లనూరు మండల పరిధిలోకి వస్తుంది. పక్క మండలం పుట్లూరు. ఈ రెండు మండలాల్లో ఆయనకు బలమైన అనుచరవర్గం వుంది. ఈ మండలాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అడ్డుతగులుతూ వ్యతిరేక వర్గాన్ని తన అనుచర వర్గంపైకి ఉసిగొల్సుతున్నారనే భావనలో పెద్దారెడ్డి వున్నారు. అసలు మన ప్రాంతంలో పెద్దారెడ్డి పెత్తనమేంటని పద్మావతి భర్త సాంబశివరావు ఆమెను రెచ్చగొడుతున్నారు.
పుండుమీద కారం చల్లినట్లుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి కొరకరాని కొయ్యలా తయారైన భోగాతి నారాయణరెడ్డికి శింగనమల ఎమ్మెల్యే రాజకీయంగా అండగా వుండటం కూడా మింగుడు పడటం లేదు. ఒకప్పుడు పుట్లూరు యల్లనూరు మండలాల్లో జేసీ వర్గాన్ని లీడ్ చేసిన భోగాతి నారాయణరెడ్గికి వైసీపీలోనూ పెద్దపీట వేస్తుండటంతో పెద్దారెడ్డి లోలోన మధనపడుతున్నారు. పైగా ఆయనకు భారీగా కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు. వైసీపీ అధికారంలో వున్నా తనకు అన్ని విధాలా అండదండగా వున్న పుట్లూరు , యల్లనూరు మండలాల్లోని అనుచరవర్గం ఇబ్బందులు పడుతుండటం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంపై సన్నిహితులతో కేతిరెడ్డి ఆవేదన చెందుతున్నారు.
పుట్లూరు మండలంలో పెద్దారెడ్డి కొనుగోలు చేసిన భూములను ఆన్ లైన్లోకి ఎక్కించకుండా ఎమ్మెల్యే పద్మావతి అడ్డుపడుతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్న మాట. ఇలాగైతే తాను అక్కడ ధర్నాలు చేయాల్సి వస్తుందని పెద్దారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక యల్లనూరు మండలం దంతలపల్లిలో ఉపాధిహామీ పనుల విషయంలో పెద్దారెడ్డి , భోగాతి నారాయణరెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. పెద్దారెడ్డి వర్గీయులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఒత్తిడితో భోగాతి నారాయణరెడ్డి వర్గీయులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట. ఈ కొట్లాట ఇంకెంత దూరం పోతుందోనని అనంతపురం వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు…
This post was last modified on May 12, 2023 2:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…