Political News

పొత్తుల‌పై ప‌వ‌న్‌దే నిర్ణ‌యం:  నాగ‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాల‌నేది. ఆయ‌న ఇష్ట‌మేన‌ని, ఆయ‌న‌కు ఎవ‌రూ ఎదురు చెప్ప‌డానికి వీల్లేద‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎవ‌రూ త‌మ‌కు స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని `ఓవ‌ర్గం మీడియా`ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. “కొన్ని మీడియాలు మాకు స‌ల‌హాలు ఇస్తున్నాయి. వారి వారి పార్టీల‌కు స‌ల‌హాలు ఇస్తే మంచిది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.

‘రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవాలి.. అప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది’  అని నాగబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ.. నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “మాకు స‌ల‌హాలు ఇచ్చేవారు ఎక్కువ‌య్యారు. అంత అవ‌స‌రం మాకు లేదు. పార్టీ పెట్టిన‌ప్పుడు ఎవ‌రి స‌ల‌హాలు తీసుకున్నాం. “ అని నిష్టూరంగా మాట్టాడారు.

‘2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దు. జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలి. ప్రజల్లో చైతన్యం మొదలైంది. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు రాగా… ఇప్పుడు ఓటింగ్‌ శాతం 35కు పెరిగిందని అంచనాలు చెబుతున్నాయి. పార్టీకి మహిళలు ఆక్సిజన్‌ లాంటివారు. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాధాన్యం ఉంటుంది` అని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.  ఇదే స‌మ‌యంలో వైసీపీ పాల‌న‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాయకులు రూ. లక్షల కోట్లు స్వాహా చేస్తుంటే.. ప్రజలకు మంచి చేయడాని కి డబ్బులు ఎందుకు ఉండవని జ‌గ‌న్ స‌ర్కారును నాగబాబు ప్రశ్నించారు. పవన్‌ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తారని చెప్పారు. ఇదేస‌మ‌యంలో రైతుల‌కు ఇప్ప‌టి నుంచి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా నాగ‌బాబు ప్ర‌సంగంలో విమ‌ర్శ‌లు.. నిష్టూరాలే క‌నిపించ‌డంతో పార్టీ నేత‌లు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

This post was last modified on May 8, 2023 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago