ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్ర మం.. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ పొలిటీషియన్.. విష్ణుకుమార్రాజు సస్పెన్షన్కు దారి తీస్తోందా? బీజేపీ ఆయనపపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఈ ఓపెన్ హార్ట్ కార్యక్రమం ఆదివారం(7వ తేదీ) రాత్రి 8.30కు ప్రసారం కావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే రెండు రోజులుగా ప్రోమో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రోమోలో.. విష్ణు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ రాష్ట్రనాయకత్వం.. ఆయనకు నోటీ సులు పంపించింది. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని కూడా.. ఆయనను ప్రశ్నిం చింది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు.. ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం జగన్ అక్రమ సంపాదనపై రాజు వ్యాఖ్యలు చేశారని.. బీజేపీ నేతలు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విష్ణు కుమార్రాజుకు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా(కార్యక్రమం ప్రసారం కావడానికి ముందే) వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై(వివేకా కేసులో సీబీఐ వ్యవహారం) అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. మరి దీనిపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 7, 2023 3:11 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…