Political News

ఏపీలో రాజ‌కీయం జంపింగుల ప‌ర్వం

“అవును.. అప్ప‌ట్లో మమ్మ‌ల్ని మీరు తిట్టారు. మాకు ఇంకా గుర్తుంది. కానీ.. మీరేమ‌న్నా.. మాపై క‌క్ష‌తో తిట్టారా? కేవ‌లం రాజ‌కీయంగా చేసిన కామెంట్లు. వాటిని మేం ప‌ట్టించుకునేది లేదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. ఇదంతా కేవ‌లం రాజ‌కీయాల్లో భాగం. మేం మ‌న‌సులో పెట్టుకోలే దు. మీరు కూడా అంతే. డేటు టైము చెప్పండి. మా వాళ్లు వ‌స్తారు. మీతో మాట్లాడ‌తారు” ఇదీ.. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట‌.

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది కూడా అదే. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే ఈ రెండు పార్టీలు కూడా రాజ‌కీయంగా బ‌లం పుంజుకునే క్ర‌మంలో అనేక వ్యూహాలు ర‌చిస్తున్నాయి. వీటిలో ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఒక వ్యూహం. దీనిని ఎలానూ చూస్తున్నాయి. వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో వైసీపీ, టీడీపీలు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి. అయితే.. అదే స‌మ‌యంలో ఎదుటి పార్టీల్లోని అసంతృప్తుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఓటూ ఇంపార్టెంటేన‌ని పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎదుటి పార్టీల్లో అసంతృప్తి గా ఉన్న‌వారికి గేలం విసురుతున్నాయి. ఇలాంటివారిలో గ‌తంలో త‌మ పార్టీల్లో ప‌నిచేసి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి వెళ్తూ.. అప్ప‌టి వ‌రకు ఉన్న పార్టీపై మాట‌ల తూటాలు పేల్చిన వారు కూడా..ఉన్నారు. కానీ, ఎందుకో.. ఇలా వెళ్లినా.. కొంద‌రు ఆయా పార్టీల్లో హైలెట్ కాలేక పోయారు.

దీంతో ఇప్పుడు.. వారంతా ఎటూ కాకుండా ఉన్నారు. కానీ, వీరివ‌ల్ల త‌మ‌కు లాభం ఉంటుంద‌ని భావిస్తున్న టీడీపీ, వైసీపీలు.. వారికి ఎర‌వేస్తున్నాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడు టికెట్లు ఇస్తామ‌ని చెప్ప‌క‌పోయి నా.. వారిని త‌మ‌వైపు తిప్పుకొని.. భ‌విష్య‌త్తులో ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఇలాంటివారిలో వైసీపీ నుంచి వెళ్లిన‌వారి జాబితా ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. జ‌లీల్ ఖాన్‌, జ్యోతుల నెహ్రూ, గిడ్డి ఈశ్వ‌రి, సుజ‌య్ కృష్ణ‌రంగారావు స‌హా ప‌లువురు కీల‌క నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా టీడీపీ నుంచి వెళ్లి.. ఎలాంటి ప్రాధాన్యం లేకుండా వైసీపీలో ఉన్న వారిని టీడీపీ కూడా ఇలానే ఆహ్వానిస్తోంది. దీంతో ఈ నేత‌లు ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వ‌స్తుందో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు. ఒక అంచ‌నాకు వ‌చ్చాక‌.. జంపింగుల ప‌ర్వం ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

This post was last modified on May 8, 2023 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

29 minutes ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

3 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago