Political News

ఏపీలో రాజ‌కీయం జంపింగుల ప‌ర్వం

“అవును.. అప్ప‌ట్లో మమ్మ‌ల్ని మీరు తిట్టారు. మాకు ఇంకా గుర్తుంది. కానీ.. మీరేమ‌న్నా.. మాపై క‌క్ష‌తో తిట్టారా? కేవ‌లం రాజ‌కీయంగా చేసిన కామెంట్లు. వాటిని మేం ప‌ట్టించుకునేది లేదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. ఇదంతా కేవ‌లం రాజ‌కీయాల్లో భాగం. మేం మ‌న‌సులో పెట్టుకోలే దు. మీరు కూడా అంతే. డేటు టైము చెప్పండి. మా వాళ్లు వ‌స్తారు. మీతో మాట్లాడ‌తారు” ఇదీ.. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట‌.

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది కూడా అదే. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే ఈ రెండు పార్టీలు కూడా రాజ‌కీయంగా బ‌లం పుంజుకునే క్ర‌మంలో అనేక వ్యూహాలు ర‌చిస్తున్నాయి. వీటిలో ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఒక వ్యూహం. దీనిని ఎలానూ చూస్తున్నాయి. వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో వైసీపీ, టీడీపీలు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి. అయితే.. అదే స‌మ‌యంలో ఎదుటి పార్టీల్లోని అసంతృప్తుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఓటూ ఇంపార్టెంటేన‌ని పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎదుటి పార్టీల్లో అసంతృప్తి గా ఉన్న‌వారికి గేలం విసురుతున్నాయి. ఇలాంటివారిలో గ‌తంలో త‌మ పార్టీల్లో ప‌నిచేసి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి వెళ్తూ.. అప్ప‌టి వ‌రకు ఉన్న పార్టీపై మాట‌ల తూటాలు పేల్చిన వారు కూడా..ఉన్నారు. కానీ, ఎందుకో.. ఇలా వెళ్లినా.. కొంద‌రు ఆయా పార్టీల్లో హైలెట్ కాలేక పోయారు.

దీంతో ఇప్పుడు.. వారంతా ఎటూ కాకుండా ఉన్నారు. కానీ, వీరివ‌ల్ల త‌మ‌కు లాభం ఉంటుంద‌ని భావిస్తున్న టీడీపీ, వైసీపీలు.. వారికి ఎర‌వేస్తున్నాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడు టికెట్లు ఇస్తామ‌ని చెప్ప‌క‌పోయి నా.. వారిని త‌మ‌వైపు తిప్పుకొని.. భ‌విష్య‌త్తులో ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ పెడుతున్న‌ట్టు స‌మాచారం. ఇలాంటివారిలో వైసీపీ నుంచి వెళ్లిన‌వారి జాబితా ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. జ‌లీల్ ఖాన్‌, జ్యోతుల నెహ్రూ, గిడ్డి ఈశ్వ‌రి, సుజ‌య్ కృష్ణ‌రంగారావు స‌హా ప‌లువురు కీల‌క నేత‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా టీడీపీ నుంచి వెళ్లి.. ఎలాంటి ప్రాధాన్యం లేకుండా వైసీపీలో ఉన్న వారిని టీడీపీ కూడా ఇలానే ఆహ్వానిస్తోంది. దీంతో ఈ నేత‌లు ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డ్డారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వ‌స్తుందో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు. ఒక అంచ‌నాకు వ‌చ్చాక‌.. జంపింగుల ప‌ర్వం ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

This post was last modified on May 8, 2023 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…

5 minutes ago

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి… ఏం జరిగింది?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…

57 minutes ago

రామాయణ – ఆరు గంటల అసలైన సవాల్

ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…

3 hours ago

ఈ ‘మగ’ బుద్ధికి కన్న బిడ్డలు బలి

సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…

3 hours ago

మోసం మాటున ‘డెకాయిట్’ ప్రేమకథ

విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…

3 hours ago

శోభన్ సోదరులకు మంచి టైమ్ వచ్చినట్టే

సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…

4 hours ago