అధికారం అహంకారాన్ని ఇవ్వకూడదు. బాధ్యతను పెంచాలి. ఈ విషయాన్ని కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఎలా మరిచిపోతారు? తామున్నదే ప్రజలకు సేవ చేయటానికి అంటూ ఓట్లు వేయమని అడిగి మరీ ఎన్నికైన వారు.. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ.. నోరు పారేసుకోకూడదు. కానీ.. కొందరు నేతల తీరు చూస్తే.. మరీ ఇంత అహంకారం అవసరమా? అన్న భావన కలిగేలా ఉంటుంది. తాజాగా ఏపీకి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఇదే తీరులో కనిపిస్తాయి.
అకాల వర్షాలతో ఏపీలోని రైతులు ఆగమాగం అవుతున్నారు. కళ్ల ముందే పంట తడిచిపోయిన వారు కొందరైతే.. మరికొందరి పంటలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అకాల వర్షాలతో ఎక్కువమంది రైతుల కంట కన్నీరు కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయటం తర్వాత.. ఊరడింపు మాటలతో వారిలో మనోధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నోరు పారేసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన వద్దకు వచ్చిన ఒక రైతు అకాల వర్షాలతో తన ధాన్యం తడిచిపోయి.. మొలకొచ్చిందని వేదన వ్యక్తం చేశారు. ఈ మాటకు సదరు మంత్రికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తానంటూ విరుచుకుపడ్డారు.
వేదనతో తమ సమస్యల్ని చెప్పుకోవటానికి వచ్చిన రైతు మీద అలా నోరు పారేసుకోవటం ఏమిటి? అంటూ మండిపడుతున్నారు. వర్షం కారణంగా పంటలు నష్టపోయిన వేళ.. వేదనతో తమ కష్టాన్ని చెప్పుకోవటానికి వచ్చిన అన్నదాతో మంత్రి అలా మాట్లాడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి నోటి నుంచి వచ్చిన మాట వైరల్ గా మారటంతో ఆయన నష్ట నివారణ చర్యలుచేపట్టినట్లు చెబుతున్నారు.
తన వద్దకు వచ్చిన రైతులతో తాను చక్కగానే సమాధానం చెప్పానని.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి రైతు కాదని.. తాగుబోతు అని చెప్పారు. కావాలని తన వద్దకు వచ్చి మాట్లాడాడని చెప్పిన మంత్రి.. అయినా తాను మాట్లాడినదేమీ బూతు కాదు కదా? అంటూ సమర్థించుకునే వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 7, 2023 1:20 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…