అధికారం అహంకారాన్ని ఇవ్వకూడదు. బాధ్యతను పెంచాలి. ఈ విషయాన్ని కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఎలా మరిచిపోతారు? తామున్నదే ప్రజలకు సేవ చేయటానికి అంటూ ఓట్లు వేయమని అడిగి మరీ ఎన్నికైన వారు.. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ.. నోరు పారేసుకోకూడదు. కానీ.. కొందరు నేతల తీరు చూస్తే.. మరీ ఇంత అహంకారం అవసరమా? అన్న భావన కలిగేలా ఉంటుంది. తాజాగా ఏపీకి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఇదే తీరులో కనిపిస్తాయి.
అకాల వర్షాలతో ఏపీలోని రైతులు ఆగమాగం అవుతున్నారు. కళ్ల ముందే పంట తడిచిపోయిన వారు కొందరైతే.. మరికొందరి పంటలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అకాల వర్షాలతో ఎక్కువమంది రైతుల కంట కన్నీరు కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయటం తర్వాత.. ఊరడింపు మాటలతో వారిలో మనోధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నోరు పారేసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన వద్దకు వచ్చిన ఒక రైతు అకాల వర్షాలతో తన ధాన్యం తడిచిపోయి.. మొలకొచ్చిందని వేదన వ్యక్తం చేశారు. ఈ మాటకు సదరు మంత్రికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తానంటూ విరుచుకుపడ్డారు.
వేదనతో తమ సమస్యల్ని చెప్పుకోవటానికి వచ్చిన రైతు మీద అలా నోరు పారేసుకోవటం ఏమిటి? అంటూ మండిపడుతున్నారు. వర్షం కారణంగా పంటలు నష్టపోయిన వేళ.. వేదనతో తమ కష్టాన్ని చెప్పుకోవటానికి వచ్చిన అన్నదాతో మంత్రి అలా మాట్లాడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి నోటి నుంచి వచ్చిన మాట వైరల్ గా మారటంతో ఆయన నష్ట నివారణ చర్యలుచేపట్టినట్లు చెబుతున్నారు.
తన వద్దకు వచ్చిన రైతులతో తాను చక్కగానే సమాధానం చెప్పానని.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి రైతు కాదని.. తాగుబోతు అని చెప్పారు. కావాలని తన వద్దకు వచ్చి మాట్లాడాడని చెప్పిన మంత్రి.. అయినా తాను మాట్లాడినదేమీ బూతు కాదు కదా? అంటూ సమర్థించుకునే వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 7, 2023 1:20 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…