Political News

బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్.. కొడుక్కి దర్శి టిక్కెట్

ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య ఆధిపత్య పోరు ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో ముద్ర వేసుకున్నారు.

పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై పొలిటికల్‌ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య అనుచరులతో టచ్‌లో ఉందని, ఒకటి రెండు సార్లు వారితో తెదేపా అధిష్టానం మాట్లాడిందని చెప్తున్నారు.

టీడీపీతో బాలినేని ప్రతినిధులు చర్చలు జరిపారని.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. పైగా టీడీపీ ఆయనకు చాలా మంచి ఆఫర్ ఇచ్చిందని ఒంగోలు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి దర్శి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి టీడీపీ పెద్దలు అంగీకరించారని చెప్తున్నారు. జగన్ సొంత కుటుంబానికి చెందిన నేతను తమ పార్టీలోకి తేవడం వల్ల ఆ పార్టీలో బలమైన నెగటివ్ సిగ్నల్ పంపినట్లవుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీ ఈ భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు.

ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నప్పటికీ దిల్లీ లిక్కర్ స్కాం రగడ కారణంగా ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో వైసీసీ అక్కడ వైవీ సుబ్బారెడ్డిని కానీ, ఆయన కుమారుడిని కానీ రంగంలోకి దించుతున్నట్లు చెప్తున్నారు. దీంతో బాలినేని ఎలాగైనా సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓడించాలన్న పట్టుదలతో టీడీపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు.

ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీకి అనుకూలత ఉండడంతో పాటు వైసీపీలో వర్గపోరు కారణంగా బాలినేనిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తే విజయం గ్యారంటీ అని టీడీపీ లెక్కలేస్తోంది. అయితే.. ఎంత సొంత అవసరమైనప్పటికీ రాజకీయంలో ఆరితేరిపోయిన బాలినేని ఇదే అదనుగా టీడీపీతో తన కుమారుడి టికెట్ వ్యవహారం కూడా ఫైనలైజ్ చేయించుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు చెప్తున్నారు. దర్శిలో తన కుమారుడు పోటీ చేస్తే అక్కడ టీడీపీ నేతల నుంచి పూర్తి సహకారం అందేలా పార్టీ పెద్దలు ఆదేశాలు ఇవ్వాలని.. ముఖ్యంగా ఎన్నికల నాటికి సిద్ధా రాఘవరావు వంటివారు తిరిగి టీడీపీలోకి వచ్చినా తన కుమారుడి టికెట్‌కు, విజయానికి ఢోకా లేకుండా చూడాలని బేరాలాడుతున్నారట.

This post was last modified on May 5, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

43 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago