Political News

బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్.. కొడుక్కి దర్శి టిక్కెట్

ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య ఆధిపత్య పోరు ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో ముద్ర వేసుకున్నారు.

పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై పొలిటికల్‌ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య అనుచరులతో టచ్‌లో ఉందని, ఒకటి రెండు సార్లు వారితో తెదేపా అధిష్టానం మాట్లాడిందని చెప్తున్నారు.

టీడీపీతో బాలినేని ప్రతినిధులు చర్చలు జరిపారని.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. పైగా టీడీపీ ఆయనకు చాలా మంచి ఆఫర్ ఇచ్చిందని ఒంగోలు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. బాలినేనికి ఒంగోలు ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి దర్శి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి టీడీపీ పెద్దలు అంగీకరించారని చెప్తున్నారు. జగన్ సొంత కుటుంబానికి చెందిన నేతను తమ పార్టీలోకి తేవడం వల్ల ఆ పార్టీలో బలమైన నెగటివ్ సిగ్నల్ పంపినట్లవుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీ ఈ భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు.

ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నప్పటికీ దిల్లీ లిక్కర్ స్కాం రగడ కారణంగా ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో వైసీసీ అక్కడ వైవీ సుబ్బారెడ్డిని కానీ, ఆయన కుమారుడిని కానీ రంగంలోకి దించుతున్నట్లు చెప్తున్నారు. దీంతో బాలినేని ఎలాగైనా సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓడించాలన్న పట్టుదలతో టీడీపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు.

ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీకి అనుకూలత ఉండడంతో పాటు వైసీపీలో వర్గపోరు కారణంగా బాలినేనిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తే విజయం గ్యారంటీ అని టీడీపీ లెక్కలేస్తోంది. అయితే.. ఎంత సొంత అవసరమైనప్పటికీ రాజకీయంలో ఆరితేరిపోయిన బాలినేని ఇదే అదనుగా టీడీపీతో తన కుమారుడి టికెట్ వ్యవహారం కూడా ఫైనలైజ్ చేయించుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు చెప్తున్నారు. దర్శిలో తన కుమారుడు పోటీ చేస్తే అక్కడ టీడీపీ నేతల నుంచి పూర్తి సహకారం అందేలా పార్టీ పెద్దలు ఆదేశాలు ఇవ్వాలని.. ముఖ్యంగా ఎన్నికల నాటికి సిద్ధా రాఘవరావు వంటివారు తిరిగి టీడీపీలోకి వచ్చినా తన కుమారుడి టికెట్‌కు, విజయానికి ఢోకా లేకుండా చూడాలని బేరాలాడుతున్నారట.

This post was last modified on May 5, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago