Political News

ఆయన అద్వానీ పేరెత్తగానే..

2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది.

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించి.. రామ మందిర ఏర్పాటు దిశగా ఎంతో పోరాడిన.. అలాగే భారతీయ జనతా పార్టీకి దేశంలో తిరుగులేని ఆదరణ రావడంలో కీలకంగా వ్యవహరించిన అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ ఈ ఘట్టంలో పాలుపంచుకోలేక పోవడం విచారకరం.

వయసు ప్రభావం, కరోనా ముప్పు లాంటి కారణాలు చెబుతున్నారు కానీ.. గత కొన్నేళ్లలో ఉద్దేశపూర్వకంగా అద్వానీకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించేసిన మోడీ.. ఈ కార్యక్రమానికి ఆయన వస్తే ఆయనకు క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో పక్కన పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ రామమందిర శంకు స్థాపన కార్యక్రమంలో అద్వానీ పేరు వినిపించకుండా ఏమీ లేదు. ర్యాలీలో ఆద్యంతం ఆయన పేరు మార్మోగింది. శంకు స్థాపన సందర్భంగానే జై అద్వానీ నినాదాలు వినిపించాయి. అలాగే భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అద్వానీ పేరెత్తారు.

మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

This post was last modified on August 9, 2020 7:44 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago