Political News

ఆయన అద్వానీ పేరెత్తగానే..

2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది.

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించి.. రామ మందిర ఏర్పాటు దిశగా ఎంతో పోరాడిన.. అలాగే భారతీయ జనతా పార్టీకి దేశంలో తిరుగులేని ఆదరణ రావడంలో కీలకంగా వ్యవహరించిన అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ ఈ ఘట్టంలో పాలుపంచుకోలేక పోవడం విచారకరం.

వయసు ప్రభావం, కరోనా ముప్పు లాంటి కారణాలు చెబుతున్నారు కానీ.. గత కొన్నేళ్లలో ఉద్దేశపూర్వకంగా అద్వానీకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించేసిన మోడీ.. ఈ కార్యక్రమానికి ఆయన వస్తే ఆయనకు క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో పక్కన పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ రామమందిర శంకు స్థాపన కార్యక్రమంలో అద్వానీ పేరు వినిపించకుండా ఏమీ లేదు. ర్యాలీలో ఆద్యంతం ఆయన పేరు మార్మోగింది. శంకు స్థాపన సందర్భంగానే జై అద్వానీ నినాదాలు వినిపించాయి. అలాగే భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అద్వానీ పేరెత్తారు.

మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

This post was last modified on August 9, 2020 7:44 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago