Political News

ఇక‌, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ దూకుడు.. ఢిల్లీకి కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయ‌న ఢిల్లీకి చేరుకుని ఇక్క‌డ నిర్మించిన బీఆర్ ఎస్ జాతీయ భ‌వ‌నాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు క‌దుపుతున్న కేసీఆర్ దీనికి అనుగుణంగా ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం సీఎం గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం)ను ప్రారంభిస్తారు. తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం ఒంటి గంటా 5 నిమిషాలకు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఒకటిన్నర వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయంలో గడుపుతారు. ఈ కార్యక్రమం కోసం కేసీఆర్‌ గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి రహదారులు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పర్యవేక్షించారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఎక్క‌డ నిర్మించారు?

ఢిల్లీలోని కీల‌క‌మైన వసంత్‌ విహార్ ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2020 అక్టోబరు 9న కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ 1315 గజాల స్థలం కేటాయించింది. ఆ స్థలానికి బీఆర్ఎస్.. మార్కెట్‌ విలువ ప్రకారం 8కోట్ల 41లక్షల 37వేల 500, వార్షిక స్థల అద్దె కింద 21లక్షల 3వేల 438 రూపాయాలు చెల్లించింది. అనంతరం ఆ స్థలంలో ఉన్న చిన్నపాటి కొండను తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా మార్చింది. కేసీఆర్ దీని నిర్మాణానికి 2021 సెప్టెంబరు 2న భూమి పూజ చేశారు.

నిర్మాణ పనులను ఎండీపీ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించారు. రెండేళ్లలోపే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని జీ+4 అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సమావేశ మందిరం, క్యాంటీన్‌, మూడో అంతస్తులో పార్టీ అధ్యక్షుని ఛాంబర్‌ ఏర్పాటు చేశారు. అతిథుల కోసం పైఅంతస్తులో ప్రత్యేక గదులు నిర్మించారు. కార్యాలయంలో మొత్తం 14 గదులు ఉన్నాయి.

This post was last modified on May 3, 2023 11:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

55 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

7 hours ago