తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. యాత్ర 90వ రోజు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ, టీడీపీ అధికారానికి వస్తే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని జగన్ చెబుతున్నారు. యువగళానికి సీమ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
లోకేష్ కు వచ్చిన ప్రజాదరణ ఓర్వలేక దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను లోకేష్ ఎండగట్టడంతో అక్కడి వైసీపీ నేతలు తట్టుకోలేక ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాదయాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. చివరకు టీడీపీలోనే కొందరిని తమ వైపుకు తిప్పుకుని గొడవ చేయించారు. ఏదో జరుగుతోందని ముందే గ్రహించిన మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి అన్ని చోట్ల తనవారిని పెట్టేసి గొడవలు కాకుండా చూసుకున్నారు. అయినా ఒక చోట మాత్రం చిన్నపాటి గందరగోళం తప్పలేదు.
కోసిగిలో జరిగిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. లోకేష్ కూడా ఆవేశంగా ప్రసంగించారు. స్పీచ్ ముగుస్తున్న తరుణంలో కొంత మంది గొడవకు దిగారు. వారిని వారించడం కష్టమైంది. ఇంఛార్జ్ తిక్కారెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలిచ్చారు..
సభ ముగిసి విశ్రాంతి ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకునేందుకు లోకేష్ ప్రయత్నించడంతో అసలు సంగతి బయటపడింది. టీడీపీ టికెట్ కోసం పోటి పడుతున్న వారి పనేనని తెలిసింది. నియోజకవర్గం ఇంఛార్జ్ తిక్కారెడ్డిని కాదని తనకు టికెట్ ఇవ్వాలని ఉల్లిగయ్య ఎదురుచూస్తున్నారు. ఆ పని కుదరదని తెలియడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఉలిగయ్య బాధను అర్థం చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. ఉలిగయ్య వర్గాన్ని తన వైపుకు తిప్పుకున్నారట.
కోసిగి మీటింగ్ చివర్లో ఉలిగయ్య వర్గమే ఇంఛార్జ్ అనుచరులతో గొడవ పడిందని లోకేష్ తెప్పించుకున్న రిపోర్ట్ లో తేలిందట. అయినా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలెయ్యాలని, అన్ని సంగతులు తాను చూసుకుంటానని తిక్కారెడ్డికి లోకేష్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ పని వైసీపీ వాళ్లు చేయించారని, అయితే టీడీపీలో కొందరు కోవర్టులు వారితో కలిసి పోవడమే బాధాకరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఉలిగయ్య వర్గంపై టీడీీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…