Political News

ఇప్పుడు ఖమ్మం అంత వీజీ కాదు కేసీఆర్

వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం జిల్లాలోని అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. జిల్లాలోని 10 సీట్లలో గడచిన రెండు ఎన్నికల్లోనో ఒక్కోసీటు మాత్రమే గెలుచుకుంది. అన్నీ సీట్లు లేదా కనీసం మెజారిటి నియోజకవర్గాలనైనా గెలవాలన్నది కేసీయార్ పట్టుదల. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు.

గడచిన రెండు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వచ్చేఎన్నికల్లో రిపీట్ కావద్దని బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో గండం ఎదురైంది. బీఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలవనివ్వనంటు చాలెంజ్ చేశారు. కేసీయార్ తో పొంగులేటికి వివాదం ముదిరిన కారణంగా పొంగులేటి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి కూడా ఖమ్మం జిల్లా కేసీయార్ కు కొరుకుడు పడటంలేదు.

ఖమ్మం జిల్లామీద ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రభావం కూడా కనబడలేదు. అసలు కేసీయార్ ప్రభావమే జిల్లామీద లేదు. దాంతో ఒక్కొక్క సీటులో మాత్రమే పార్టీ గెలిచింది. కాకపోతే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఎంఎల్ఏలను చేర్చుకోవటం ద్వారా తమకు మెజారిటి సీట్లున్నాయని అనిపించుకుంటున్నారంతే. ఇలా అనిపించుకోవటం కాకుండా డైరెక్టుగా తమ అభ్యర్ధులనే గెలిపించుకోవాలన్నది కేసీయార్ పట్టుదల.

కేసీయార్ ను దెబ్బకొట్టేందుకు పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో తెలీదు. మాజీ ఎంపీ మద్దతుదారుల సమాచారం ప్రకారం పొంగులేటి తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారట. కాంగ్రెస్ లో చేరితే మాత్రమే కేసీయార్ ను అడ్డుకోవటం సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారట. బీజేపీలో చేరితే తన టార్గెట్ రీచ్చవటం కష్టమని పొంగులేటికి కూడా అర్ధమైందట. అందుకనే తన మద్దతుదారులకు టికెట్లు ఖాయమైతే కాంగ్రెస్ లో చేరుతారట. మరి కేసీయార్, పొంగులేటి ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుంది ? ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సిందే.

This post was last modified on May 3, 2023 10:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

20 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago