వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం జిల్లాలోని అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. జిల్లాలోని 10 సీట్లలో గడచిన రెండు ఎన్నికల్లోనో ఒక్కోసీటు మాత్రమే గెలుచుకుంది. అన్నీ సీట్లు లేదా కనీసం మెజారిటి నియోజకవర్గాలనైనా గెలవాలన్నది కేసీయార్ పట్టుదల. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు.
గడచిన రెండు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వచ్చేఎన్నికల్లో రిపీట్ కావద్దని బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో గండం ఎదురైంది. బీఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలవనివ్వనంటు చాలెంజ్ చేశారు. కేసీయార్ తో పొంగులేటికి వివాదం ముదిరిన కారణంగా పొంగులేటి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి కూడా ఖమ్మం జిల్లా కేసీయార్ కు కొరుకుడు పడటంలేదు.
ఖమ్మం జిల్లామీద ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రభావం కూడా కనబడలేదు. అసలు కేసీయార్ ప్రభావమే జిల్లామీద లేదు. దాంతో ఒక్కొక్క సీటులో మాత్రమే పార్టీ గెలిచింది. కాకపోతే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఎంఎల్ఏలను చేర్చుకోవటం ద్వారా తమకు మెజారిటి సీట్లున్నాయని అనిపించుకుంటున్నారంతే. ఇలా అనిపించుకోవటం కాకుండా డైరెక్టుగా తమ అభ్యర్ధులనే గెలిపించుకోవాలన్నది కేసీయార్ పట్టుదల.
కేసీయార్ ను దెబ్బకొట్టేందుకు పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో తెలీదు. మాజీ ఎంపీ మద్దతుదారుల సమాచారం ప్రకారం పొంగులేటి తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారట. కాంగ్రెస్ లో చేరితే మాత్రమే కేసీయార్ ను అడ్డుకోవటం సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారట. బీజేపీలో చేరితే తన టార్గెట్ రీచ్చవటం కష్టమని పొంగులేటికి కూడా అర్ధమైందట. అందుకనే తన మద్దతుదారులకు టికెట్లు ఖాయమైతే కాంగ్రెస్ లో చేరుతారట. మరి కేసీయార్, పొంగులేటి ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుంది ? ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 3, 2023 10:20 am
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…