వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం జిల్లాలోని అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. జిల్లాలోని 10 సీట్లలో గడచిన రెండు ఎన్నికల్లోనో ఒక్కోసీటు మాత్రమే గెలుచుకుంది. అన్నీ సీట్లు లేదా కనీసం మెజారిటి నియోజకవర్గాలనైనా గెలవాలన్నది కేసీయార్ పట్టుదల. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోతున్నారు.
గడచిన రెండు ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వచ్చేఎన్నికల్లో రిపీట్ కావద్దని బాగా పట్టుదలగా ఉన్నారు. అయితే ఊహించని విధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో గండం ఎదురైంది. బీఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలవనివ్వనంటు చాలెంజ్ చేశారు. కేసీయార్ తో పొంగులేటికి వివాదం ముదిరిన కారణంగా పొంగులేటి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి కూడా ఖమ్మం జిల్లా కేసీయార్ కు కొరుకుడు పడటంలేదు.
ఖమ్మం జిల్లామీద ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రభావం కూడా కనబడలేదు. అసలు కేసీయార్ ప్రభావమే జిల్లామీద లేదు. దాంతో ఒక్కొక్క సీటులో మాత్రమే పార్టీ గెలిచింది. కాకపోతే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఎంఎల్ఏలను చేర్చుకోవటం ద్వారా తమకు మెజారిటి సీట్లున్నాయని అనిపించుకుంటున్నారంతే. ఇలా అనిపించుకోవటం కాకుండా డైరెక్టుగా తమ అభ్యర్ధులనే గెలిపించుకోవాలన్నది కేసీయార్ పట్టుదల.
కేసీయార్ ను దెబ్బకొట్టేందుకు పొంగులేటి ఏ పార్టీలో చేరుతారో తెలీదు. మాజీ ఎంపీ మద్దతుదారుల సమాచారం ప్రకారం పొంగులేటి తొందరలోనే కాంగ్రెస్ లో చేరుతారట. కాంగ్రెస్ లో చేరితే మాత్రమే కేసీయార్ ను అడ్డుకోవటం సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారట. బీజేపీలో చేరితే తన టార్గెట్ రీచ్చవటం కష్టమని పొంగులేటికి కూడా అర్ధమైందట. అందుకనే తన మద్దతుదారులకు టికెట్లు ఖాయమైతే కాంగ్రెస్ లో చేరుతారట. మరి కేసీయార్, పొంగులేటి ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుంది ? ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…