కాంగ్రెస్ పార్టీకి అవసరమైన బూస్టప్ ఇవ్వటానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధి తెలంగాణాకు వస్తున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈనెల 8వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే నిరుద్యోగ బహిరంగత సభకు ముఖ్యఅతిధిగా ప్రియాంక హాజరుకాబోతున్నట్లు నేతలు చెబుతున్నారు. మొన్ననే 28వ తేదీన నల్గొండలో జరిగిన మొదటి నిరుద్యోగ బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ నేతలు ఫుల్లు జోష్ లో ఉన్నారు.
మొత్తం ఐదుచోట్ల నిరుద్యోగ బహిరంగసభలు నిర్వహించాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. ఇందులో ఒక సభ జరిగితే మరో నాలుగు బహిరంగసభలు జరగాల్సుంది. ఇందులో పాల్గొనేందుకే ప్రియాంక హైదరాబాద్ కు రాబోతున్నారట. ఎలాగూ బహిరంగసభలో పాల్గొంటారు కాబట్టి సీనియర్ నేతలతో కూడా భేటీ అవుతారని నేతలు చెబుతున్నారు. అసలు తెలంగాణాపైన ప్రియాంక ప్రత్యేక దృష్టిపెట్టారని, రెగ్యులర్ గా పర్యటనలు చేస్తారని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది.
అయితే ఎందుకనో అది జరగలేదు. అదే పద్దతిలో రాహుల్ గాంధి కూడా తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ ప్రయత్నాలకు సీనియర్లలో కొందరు స్పీడు బ్రేకులు వేస్తున్నారు. వీటన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ ను రెచ్చిపొమ్మని చెబుతున్నదీ అధిష్టానమే సీనియర్ల రూపంలో స్పీడు బ్రేకులు వేయిస్తున్నదీ అధిష్టానమే. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక భవిష్యత్తులో వచ్చే అవకాశాలు దాదాపు తక్కువనే చెప్పాలి. అందుకనే రాహుల్ గాంధితో పాటు ప్రియాంక కూడా తెలంగాణాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రచారం జరుగుతున్నట్లు ఇన్చార్జిలుగా కాకుండా రెగ్యులర్ గా టూర్ చేయటం ద్వారా పార్టీకి జవసత్వాలు అందించాలని డిసైడ్ అయ్యారట. మరి గాంధీల ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందనేది కర్నాటక ఎన్నికల ఫలితాలపైన ఆధారపడుంటుందనటంలో సందేహంలేదు.
This post was last modified on May 2, 2023 2:31 pm
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…