నిన్న మొన్నటి వరకు బల్లగుద్ది మరీ.. ఈ నియోజకవర్గాలు మావే అని చెప్పుకొన్న వైసీపీ నాయకులకు ఇప్పుడు పెద్ద సంకటం వచ్చింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో కూసాలు కదిలిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గాలు , మరో 7 ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గతంలో కాంగ్రెస్ తర్వాత.. అదే రేంజ్లో దూసుకుపోయిన పార్టీ వైసీపీ. టీడీపీ కొన్ని స్థానాల్లో మాత్రమే బలోపేతం అయింది. బీసీ జపం కారణంగా.. టీడీపీ ఎస్సీలకు అటు ఇటుగా ఉందనే టాక్ ఉంది.
దీంతో గత ఎన్నికల్లో ఒక్క కొండపి(ఉమ్మడి ప్రకాశం) నియోజకవర్గం మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ ఎస్సీ నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది. ఇక, ఏడు ఎస్టీ స్తానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఈ 36 స్థానాల్లో ఒకటి రెండు మినహా.. అన్ని చోట్లా వైసీపీదే విజయం అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అదే నియోజకవర్గాల్లో పెద్ద కష్టం వచ్చింది. ఇదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీవ్ర అంతర్మథనంలోకి నెట్టేసింది.
కొన్నాళ్ల కిందట ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తేనెతుట్టెను వైసీపీ కదిలించింది. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లోకి, బోయ, వాల్మీకి.. తదితర కులాలను.. ఎస్టీల్లోకి చేరుస్తూ.. తీర్మానం చేయడం.. దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. ఇదే ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. నిజానికి.. ఎస్సీలు ఇప్పుడు తేడా వచ్చినా..ఎన్నికల సమయానికి ఏమైనా వారిని ఒప్పించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఎస్టీల విషయంలో మాత్రం ఇది కుదరదు.
వారు ఒక్కసారి మార్పు చెందితే.. ఇక, వారి ఓట్లు శాశ్వతంగా వైసీపీకి దూరమవుతాయి. ఇదే ఇప్పుడు వైసీపీలో నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. కనీసం.. ఈ తీర్మానం చేసే ముందు.. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో జగన్ చర్చించి ఉంటే బాగుండేదని. లేదా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆయన అంచనా వేసుకుని ఉన్నా బాగుండేదని.. ఎక్కువ మంది అభిప్రాయపడు తున్నారు. ఏదేమైనా.. ఇది ప్రభుత్వం వేసిన తొందరపాటు అడుగుగా పేర్కొంటున్నారు. ఇది.. పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.
This post was last modified on May 1, 2023 11:20 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…