మీడియా మీద కేసీయార్ తన పట్టు ఎలాగుంటుందో మరోసారి చూపించారు. కేసీయార్ అంటే యావత్ మీడియా ఎంతలా వణికిపోతోందో తాజా ఘటనలో అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను కేసీయార్ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ స్ధాయిలో సచివాలయాన్ని కేసీయార్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అంతాబాగానే ఉంది కానీ లోకల్లో మెజారిటి మీడియాను మాత్రం దూరంగానే ఉంచేశారు. ఎంపికచేసిన అతికొద్ది రిపోర్టర్లను మాత్రమే సెక్రటేరియట్ లోపలికి అనుమతించారు. మిగిలిన మీడియానంతా సెక్రటేరియట్ బయటకే నిలిపేశారు.
విచిత్రం ఏమిటంటే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఈసాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుండి మీడియా ప్రతినిధులను పిలిపించుకున్నది ప్రభుత్వం. వాళ్ళందరినీ రాచమర్యాదలతో లోపలకి తీసుకెళ్ళిన ప్రభుత్వం లోకల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వివక్ష చూపింది. లోకల్ మీడియాలో ఎంపికచేసిన అతికొద్ది రిపోర్టర్లను మాత్రమే లోపలకు అనుమతించిందట. లోకల్ మీడియాలో ఎవరిని అనుమతించాలి ? ఎవరిని బయటే ఆపేయాలనే నిర్ణయం ప్రగతిభవనే తీసుకున్నదని సమాచారం.
మామూలుగా ఇలాంటి భారీ ఈవెంట్లకు మీడియాపై బ్యాన్ పెట్టదు ప్రభుత్వం. కానీ ఇపుడు మాత్రం బ్యాన్ పెట్టేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జాబితాను తయారుచేసి పాసులు జారీచేస్తుంది. దాని ప్రకారమే రిపోర్టర్లకు పాసులు అందుతాయి. పాసులున్న వాళ్ళనే లోపలకు అనుమతిస్తారు. పాసులు జారీ చేసే సమయంలోనే ఎవరెవరికి పాసులు ఇవ్వాలనేది సంబంధిత శాఖకు తెలుసుకాబట్టి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు పౌర సంబంధాల శాఖ నిర్ణయం ఏమీలేదట.
పాసులు జారీచేయాల్సిన రిపోర్టర్ల జాబితాను ప్రగతిభవనే రెడీ చేసిందట. అంటే ప్రగతిభవన్ తయారు చేసిన జాబితా ప్రకారమే సమాచర శాఖ పాసులను పంపింది. అందుకనే మెజారిటి మీడియాను అధికారులు సెక్రటేరియల్ లోపలికి అనుమతించలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఈసాన్య రాష్ట్రాల మీడియాను ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రభుత్వం లోకల్ మీడియాను ఆపేసిందంటే అర్ధమేంటి ?
This post was last modified on May 1, 2023 11:39 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…