ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ గ్యాప్ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్కడో విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ వాదనలు ఎలా ఉన్నా ఆయన మాత్రం.. సినిమా షూటింగులకు పరిమితం అయ్యారు.
పోనీ.. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. తనకు కుదరకపోతే .. ఇతర నేతలను రంగంలోకి దింపి.. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆయన ఎక్కడా ఎలాంటి వ్యూహంతోనూ ముందుకు సాగడం లేదు. పైగా.. ఇంకేముంది.. వారాహి వాహనాన్ని రంగం లోకి దింపుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే యాత్రలు సాగిస్తానన్నారు. దీంతో పార్టీలోనూ.. అభిమానుల్లోనూ ఆశలు పెల్లుబికాయి.
కానీ, ఇప్పటి వరకు వారాహి.. రంగంలోకి దిగింది లేదు. పోనీ.. ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే విషయం పైనా క్లారిటీ లేదు. అంతిమంగా చూస్తే.. జనసేన పార్టీ ఒక వ్యూహం లేని.. ఒక సూత్రం లేని పార్టీగా మిగిలి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఆయన ఒక నిర్ణయంతీసుకుంటారో .. లేక ఎన్నికల వరకు వేచి ఉంటారో చూడాలి. ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. దీంతో వ్యక్తిగతంగా పార్టీని డెవలప్ చేసే విషయంపై ఇప్పటి వరకు పవన్ నిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం.
This post was last modified on April 30, 2023 12:22 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…