తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెన్షన్లో ఉన్న ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది టీడీపీనేనని తెలిపారు. టీడీపీ వల్లే తాను ఇంతవాడిని అయ్యానని చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన ప్రచారం అవాస్తవమని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లేనని, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేదేమీలేదని అన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, తనకు రాజకీయ జీవితం ఇచ్చింది బాబేనని రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే తానొక హిందూవాదినని, ధర్మం కోసం పనిచేస్తానని అన్నారు. తన మనస్థత్వానికి టీడీపీ కూడా మ్యాచ్ కాదని, తనకు మ్యాచ్ అయ్యే పార్టీ ఒక్క బీజేపీయేనని, తనకు టీడీపీలో చేరే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇండిపెండెంట్గా అయినా..
బీజేపీ ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని రాజాసింగ్ తెలిపారు. తనకు గోషామహల్ ప్రజలు అండగా ఉన్నారని.. ఉంటారని చెప్పారు. ధర్మ రక్షణ, గోరక్షణ విషయాల్లో తాను ముందుంటానని… అందుకే గోషామహల్ ప్రజలు తనను గౌరవిస్తారని చెప్పారు. అయితే.. బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తుందనే ఆశలు ఉన్నాయని, పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా మెండుగా ఉందని రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
This post was last modified on April 30, 2023 8:45 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…