ఏపీ సీఎం జగన్కు ఊహించని షాక్ ఇచ్చారు ఆయన బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్న బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప అస్వస్థతో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి.. సీఎం జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుండి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, రాయబారాలతో బాలినేని మళ్లీ కొంత చల్లారారు.
కానీ, పార్టీలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విపరీతంగా ప్రాధాన్యం పెరుగుతుండడంతో పాటు పవన్ కల్యాణ్, బాలినేని మధ్య సత్సంబంధాలపై జగన్ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతుండడం.. పార్టీ తనను అనుమానంగా చూస్తుండడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో తనకు విలువ ఇవ్వడం లేదంటూ ఇటీవల అనుచరుల వల్ల ఆయన వాపోయారట.
ప్రస్తుతం అస్వస్తతో హైదరాబాద్లో ఉన్నట్లు చెప్తున్నా ఎవరికీ అందుబాటులో ఉండకుండా అలా చేశారని అంటున్నారు. ఆయన పార్టీ మారే సూచనలున్నాయి.. వైసీపీని త్వరలో వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైసీపీ నుంచి వలసలు మొదలైనట్లే అనుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on April 29, 2023 4:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…