ఏపీ సీఎం జగన్కు ఊహించని షాక్ ఇచ్చారు ఆయన బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్న బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప అస్వస్థతో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి.. సీఎం జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుండి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, రాయబారాలతో బాలినేని మళ్లీ కొంత చల్లారారు.
కానీ, పార్టీలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విపరీతంగా ప్రాధాన్యం పెరుగుతుండడంతో పాటు పవన్ కల్యాణ్, బాలినేని మధ్య సత్సంబంధాలపై జగన్ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతుండడం.. పార్టీ తనను అనుమానంగా చూస్తుండడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో తనకు విలువ ఇవ్వడం లేదంటూ ఇటీవల అనుచరుల వల్ల ఆయన వాపోయారట.
ప్రస్తుతం అస్వస్తతో హైదరాబాద్లో ఉన్నట్లు చెప్తున్నా ఎవరికీ అందుబాటులో ఉండకుండా అలా చేశారని అంటున్నారు. ఆయన పార్టీ మారే సూచనలున్నాయి.. వైసీపీని త్వరలో వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైసీపీ నుంచి వలసలు మొదలైనట్లే అనుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on April 29, 2023 4:18 pm
"ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం…
అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…
వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు…
హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…