Political News

జగనన్నకు చెబితే ఏమవుతుంది ?

జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం మేనెల 9వ తేదీ నుంచి మొదలవ్వబోతోంది. తమ సమస్యలను జనాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పుకోవచ్చట. జనాలు చెప్పే సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ ప్రకారం అధికారయంత్రాంగం పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి కలెక్టర్ ఆధీనంలో ప్రభుత్వం రు. 3 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ఇదే విషయమై జగన్ ఉన్నతాధికారులతో మాట్లాడుతు ఈ ప్రోగ్రామ్ కు తన పేరుపెట్టారు కాబట్టి అధికారయంత్రాంగం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమిటో గుర్తుంచుకోవాలన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రోగ్రాములకు, పథకాలకు జగన్ పేరుపెట్టుకోవటం గొప్పకాదు. కార్యాచరణ లేదా వాటి అమలు ఎంత పక్కాగా ఉందనేది చూడాలి. ఎవరెంత చెప్పినా సమస్యంతా నిధుల దగ్గరే వస్తోంది. డబ్బులు లేనిదే ఏ ప్రోగ్రామ్, పథకం అమలుకాదు. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా డబ్బులు లేని కారణంగానే నత్తనడక నడుస్తున్నాయి. చిన్న చిన్న రోడ్లు, మురికికాల్వలు, వీధిలైట్లు లాంటి జనాలు రెగ్యులర్ గా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం కావటంలేదంటే డబ్బు కొరతే ప్రధాన కారణం.

కార్యక్రమాలను ఆర్భాటంగా ప్రకటించటం కాదు ఆచరణలోకి వచ్చినపుడే జనాలకు మేలు జరుగుతుంది. తొందరలో ప్రారంభించబోతున్న జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఇపుడు స్పందన పేరుతో జరుగుతోంది. ఇందులో జనాలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్లకే చెప్పుకోవచ్చు.

జిల్లాకు బాసులు కలెక్టర్లే. అలాంటి బాసులకు తమ సమస్యలు చెప్పుకుంటుంటే ఎన్ని పరిష్కారమవుతున్నాయి. జనాల ఫీడ్ బ్యాక్ ప్రకారం చాలా సమస్యలు పరిష్కారం కావటంలేదు. కారణం ఏమిటంటే మళ్ళీ నిధుల సమస్యే. పార్టీలోని నేతలు, కార్యకర్తలకే పనులు కావటంలేదనే అసంతృప్తి వినబడుతోంది. ఇక మామూలు జనాలను ఎవరు పట్టించుకుంటారు. ఎన్నికలకు ముందు మొదలుపెట్టబోతున్న కొత్త ప్రోగ్రామ్ అమలయ్యే విధానం బట్టి ప్రభుత్వ ఇమేజి ఆదారపడుంటుంది. ఇదివరకు లాగ కాకుండా కలెక్టర్ కు రు. 3 కోట్లు కేటాయించారు కాబట్టి కొంతలో కొంత నయమేమో చూడాలి.

This post was last modified on April 30, 2023 9:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago